సీతారామపురం పోలీసులు స్వాధీనం చేసుకున్న నాటు తుపాకీ... .

అక్రమాలకు అడ్డాగా ఉదయగిరి.. పోలీసులకు దొరికిన నాటు తుపాకీ. బుల్లెట్లు.... 
 నిద్రావస్థలో నిఘా విభాగం
 ఉదయగిరి... రెండు జిల్లాలకు సరిహద్దు ప్రాంతంగా, నెల్లూరు జిల్లాకు చిట్టచివరి ప్రాంతం గా ఉన్న ఉదయగిరి పరిసర ప్రాంతాలు అక్రమాలకు అడ్డాగా మారిపోయాయి. వన్యప్రాణుల వేట, ఎర్రచందనం నరికివేత, లక్షల్లో పేకాట, నాటు సారా తయారీ విచ్చలవిడిగా సాగుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా నిఘా వ్యవస్థ మాత్రం నిద్రావస్థలో ఉందన్న ఆరోపణలు ఎదుర్కుంటూ ఉంది. ఆదివారం సీతారామపురం పోలీసులకు ఒక నాటు తుపాకీ 16 రౌండ్ల బుల్లెట్లు లభ్యం కావడంతో ఈ ప్రాంతంలో అక్రమార్కుల సంచారం విరివిగా జరుగుతుందన్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది. ఉదయగిరి ప్రాంతం వెలిగొండ నల్లమల అడవులలో అంతర్భాగంగా వుంది. అపారమైన ఎర్రచందనం వృక్షాలు లు, అంతకంటే ఎక్కువగా సంచరించే వన్యప్రాణులు ఈ ప్రాంతానికి సొంతం. అంతేకాకుండా దట్టమైన అడవి ప్రాంతం కావడం నిఘా అంతగా లేకపోవడం ఇలాంటి కారణాలతో తో అడవులలో పేకాట స్థావరాలు, నాటుసారా కర్మాగారాలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. నిత్యం అడవుల్లో సంచరిస్తూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిన అటవీశాఖ అధికారులు కార్యాలయాల కే పరిమితం అవుతుండడంతో అటవీశాఖ తనిఖీ కేంద్రాలు కూడా అలంకారప్రాయంగా మారిపోయాయి. ప్రస్తుత లాక్ డౌన్లోడ్ పరిస్థితుల్లో ప్రజలు విలవిలలాడి పోతున్నా అక్రమార్కులకు మాత్రం కలిసొచ్చేలా మారిపోయింది. సీతారామపురం మండలం లో ఇప్పటికి మూడు సార్లు లు నాటుసారా తరలించే వ్యక్తులను ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం, ఉదయగిరి మండలం కొండ కింద పల్లెల్లో పోలీసులు తనిఖీ చేసి పేకాట స్థావరాలుగా ధ్వంసం చేయటం, తాజాగా సీతారామపురం పోలీసులకు ఒక నాటు తుపాకీ 16 రౌండ్ల బుల్లెట్లు లభ్యం కావడం ఈ ప్రాంతాన్ని కలవరపెడుతోంది, తుపాకి ఉపయోగించిన వాళ్ళు వన్యప్రాణుల వేట కోసం వచ్చారా? లేక ఎర్రచందనం స్మగ్లర్ల అనే విషయం అంతుచిక్కకుండా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చి మూడు జిల్లాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఉదయగిరి సీతారాంపురం మండలాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image