కరోనాపై పోరుకు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, యూనిసెఫ్ మధ్య అవగాహన

కరోనాపై పోరుకు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, యూనిసెఫ్ మధ్య అవగాహన


యూనిసెఫ్ లేఖపై స్పందించిన గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరించందన్


 


విజయవాడ, మే 06: ఆంధ్రప్రదేశ్ లో కరోనాపై పోరుకు యూనిసెఫ్ సహకారం అందించేందుకు ముందుకు రావటం ముదావహమని, ఎపి రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి పనిచేసేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేయటం శుభపరిణామమని రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. యూనిసెఫ్, రెడ్ క్రాస్ సొసైటీల సంయిక్త భాగస్వామ్యం ఫలితంగా సమాజంపై కరోనా మహమ్మారి చూపుతున్న ప్రభావాన్ని సమర్ధవంతగా ఎదుర్కోవటంలో క్రియాశీలక భూమికను నిర్వహిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ప్రస్తుత విపత్కర పరిస్ధితుల నేపధ్యంలో కాలపరిమితితో కూడిన కార్యక్రమాల రూపకల్పన జరగాలన్నారు. విశ్వ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అనుమతిని మంజూరు చేయాలని యూనిసెఫ్ రాసిన లేఖకు గవర్నర్ వెంటనే స్పందించారు.


ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునిసెఫ్ క్షేత్ర కార్యాలయ ముఖ్య ప్రతినిధి మీటల్ రుస్డియా రెడ్ క్రాస్ తో సంయిక్త భాగస్వామ్యాన్ని అకాంక్షిస్తూ ముందస్తుగా తమ సంసిద్ధతను వ్యక్తపరచగా, గవర్నర్ వెంటనే తదనుగుణ కార్యాచరణను వేగవంతం చేసారు. ఈ రెండు సంస్ధల భాగస్వామ్యం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ చర్యలు కొత్త రూపును సంతరించుకోనున్నాయి.  యునిసెఫ్ ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్‌క్రాస్ వాలంటీర్ల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపట్టి వారిలో సామర్ధ్య పెంపుకు దోహదం చేస్తుంది.  పిల్లల రక్షణ, నీటి వినియోగం, పారిశుధ్యం, పరిశుభ్రత కార్యకలాపాలకు సంబంధించి పాఠశాలల స్దాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ద్వారా చిన్నారులలో రోగనిరోధకతను పెంపొందించటంతో పాటు  పిల్లల అభివృద్ధి, ఆరోగ్య అవగాహన వంటి వాటిపై లోతైన అవగాహన కల్పిస్తారు.


 శ్వాసకోశ పరమైన అంశాలపై పూర్తి స్దాయి అవగాహనకు మార్గం కల్పిస్తూ భౌతిక దూరం సాధన పై ప్రత్యేక దృష్టి నిలుపుతారు. కరోనాను ఎదుర్కోవటంలో ముందువరసలో ఉండి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సంరక్షణ,  వారి వల్ల ప్రభావితమైన  వ్యక్తులు,  కుటుంబాల ప్రయోజనం కోసం కూడా ఈ రెండు సంస్ధల భాగస్వామ్యం తోడ్పడుతుందని గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌ కేంద్రంగా సేవలు అందిస్తున్న యునిసెఫ్ క్షేత్ర కార్యాలయ బాధ్యుడు మీటల్ రుస్డియా ఈ సంయిక్త భాగస్వామ్యం కోసం చొరవ తీసుకోవటం ప్రశంసనీయమన్నారు. తక్షణమే పూర్తి స్ధాయి రోడ్ మ్యాప్ తయారు చేసేలా గవర్నర్ బిశ్వ భూషన్ రెడ్ క్రాస్ అధ్యక్ష, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసారన్నారు. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ గవర్నర్ నేతృత్వంలో ఇప్పటికే విభిన్న రకాల సేవలు అందిస్తుందని, కరోనాపై పోరులో కూడా తనదైన పాత్రను పోషించనుందని మీనా వివరించారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image