విశాఖ ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటన హృదయ విదారకం: ఏ.బి.వి.పి రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్...

*విశాఖ ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటన హృదయ విదారకం: ఏ.బి.వి.పి రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్...


. వింజమూరు, మే 7 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): విశాఖపట్నం ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి పాలిమర్స్ పరిశ్రమ నుండి విషతుల్య వాయువులు విడుదలై 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు శాపంగా మారడం దురదృష్టకరమని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ అన్నారు. విశాఖ దుర్ఘటనకు సంబంధించి ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎల్.జి పాలిమర్స్ ఘటనలో 8 మంది అమాయక ప్రజలు అశువులు బాయడం, వందల మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడం కడు భాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏ.బి.వి.పి తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని కౌశిక్ ఆకాం క్షించారు. విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదానికి ఎల్.జి పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. లాక్ డౌన్ నిబంధనలను పరిశ్రమలో ప్రతిరోజూ మెయింటనెన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన పరిశ్రమలో 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంచడంలో యాజమాన్యం విఫలమైందని విమర్శించారు. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో స్టైరెస్ లీక్ జరిగి మంటలు చెలరేగాయన్నారు. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెస్ గ్యాస్ వేగంగా వ్యాప్తి చెంది విపత్కర పరిస్థితులకు దారి తీసిందన్నారు. విశాఖ పరిధిలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా చర్యలు తీసుకునే నాధులే కరువయ్యారని కౌశిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం పట్ల, పర్యావరణం పరిరక్షణ పట్ల భాధ్యతగా ఉంటూ కఠినంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అసలు మన రాష్ట్రంలో ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
 పరిశ్రమల నుండి విష రసాయనాలు, వ్యర్ధాలు వెలువడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వాలు దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా వ్యవహరిస్తుండటం అత్యంత హేయనీయమన్నారు. దుర్ఘటనలు జరిగినప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాలు ప్రకటించడం, అనంతరం చేతులు దులుపుకోవడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిపోయాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉంటున్న పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో వాటిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి భధ్రతా చర్యలకు ప్రభుత్వాలు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కౌశిక్ హితువు పలికారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు