ముమ్మరం గా లేవుట్ నిర్మాణ పనులు*

*ముమ్మరం గా లేవుట్ నిర్మాణ పనులు*
వరికుంటపాడు ,:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా రూపొందించిన ఇంటి నివేశన స్థలాలకు సంబంధించి,  వరికుంటపాడు మండలం లో లేవుట్ నిర్మాణ పనులు ముమ్మరo గా సాగుతున్నాయి. దారిద్ర్య రేఖ కు దిగువున ఉన్న కుటుంబాలకు చేయూత ని అందించే దిశగా ఈ పనులు జోరు గా సాగుతున్నాయి. శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తో అనువైన ప్రాంతాలను గుర్తించి లేవుట్ ల ఏర్పాటు చేయడం తో బాటు భూమి ని చదును చేసి ప్రొక్లైన్లు, ట్రాక్టర్ లు సాయం తో మట్టిని లేవుట్ లలో నింపి చదును చేస్తున్నారు. రోడ్డు రోలర్ సాయం తో నాణ్యత గా ప్లాట్ లను ఏర్పాటు చేసి హద్దులు ఏర్పాటు చేసారు. వరికుంటపాడు మండలం లోని 24 పంచాయతీ లలో 80 శాతం  ఈ పనులు పూర్తి కానున్నాయి. తూర్పు బోయమడుగుల పంచాయతీ  లోని అలివేలు మంగాపురం, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ లలో ఏర్పాటు చేసారు. అలాగే కాంచెరువు, ఇస్కపల్లి, జడదేవి, గువ్వడి తదితర గ్రామాల్లో ఈ పనులు వేగవంతం అయ్యాయి. ఈ పరిణామాలతో ప్రభుత్వం అందించే ఈ ఇంటి నివేశన స్థలాలు తమకు ఉచితంగా అందనుండడం సంతోషంగా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image