ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ప్రగతి సేవ సంస్థ సభ్యుల సహాయ సహకారాలతో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ప్రగతి సేవ సంస్థ సభ్యుల సహాయ సహకారాలతో ఈరోజు 08.05.2020 చిల్లకూరు మండలం లోని రైటా సత్రం లోని గిరిజన కాలనీ లోని 50 పేద కుటుంబాలకు వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.దీనికి ముఖ్య అతిధి సేవాభావం కలిగిన వ్యక్తి మన సింహపురి రెడ్డి సంక్షేమ సంగం 2 టౌన్ అధ్యక్షుడు Y.రామకృష్ణ రెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం, M.మస్థానయ్య , ప్రజెందర్ రెడ్డి,C.V.R న్యూస్ సతీష్, వాలంటీర్స్,అంగన్వాడీ టీచర్,తదితరులు పాల్గొన్నారు.