వింజమూరు మాజీ జడ్.పి.టి.సి ' పులిచర్ల ' దాతృత్వo

*వింజమూరు మాజీ జడ్.పి.టి.సి ' పులిచర్ల ' దాతృత్వo వింజమూరు, మే 17 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మాజీ జడ్.పి.టి.సి సభ్యులు, పులిచర్ల.నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పులిచర్ల.వెంకట నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు వలస కార్మికుల పట్ల ఆదివారం నాడు తమ దాతృత్వమును చాటుకున్నారు. వ్యాపార రీత్యా తరచూ గుంటూరుకు వెళుతున్న పులిచర్ల. నారాయణరెడ్డి స్వతహాగా నెల్లూరీయులను అక్కడ కూడా ఆదరిస్తూ వారికి వ్యాపారపరంగా చేయూతనిస్తూ బాసటగా నిలుస్తుంటారనే పేరుంది. అయితే ప్రస్తుతం కరోనా విపత్తు సమయంలో లాక్ డౌన్ కారణంగా గుంటూరులోనే ఉండిపోయిన పులిచర్ల.నారాయణరెడ్డి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 200 మంది వలస కార్మికులకు కాజా టోల్ గేట్ వద్ద ఎన్.హెచ్-16 రోడ్డులో ఆహార పొట్లాలు, మజ్జిగ ప్యాకెట్లును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చరవాణి ద్వారా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకుంటున్న నిర్ణయాలు సాహసోపేతమైనవిగా నారాయణరెడ్డి అభివర్ణించారు. వలస వాసులకు ఆసరాగా నిలిచిన ఈ ఆహారం అందించే కార్యక్రమంలో పులిచర్ల. అరుణకుమారి, పులిచర్ల. పృద్ధ్వీరెడ్డి, అంకినపల్లి.పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image