విశాఖ గ్యాస్ లీకేజీ సంఘటనపై గవర్నర్ దిగ్ర్బాంతి

విశాఖ గ్యాస్ లీకేజీ సంఘటనపై గవర్నర్ దిగ్ర్బాంతి


మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించిన బిశ్వ భూషణ్


సహాయ, పునరావాస చర్యలపై సియంతో చరవాణిలో మాట్లాడిన గవర్నర్


వైద్య శిబిరాల నిర్వహణలో సహాయపడాలని రెడ్ క్రాస్ శ్రేణులకు అదేశం


 


            విజయవాడ, మే 07: విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటపురం గ్రామంలోని ఎల్ జి పాలిమార్స్ కర్మాగారంలో గురువారం తెల్లవారుజామున గ్యాస్ లీకైన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వా భూసన్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన నేపధ్యంలో గవర్నర్ ప్రభుత్వ పరంగా జరుగుతున్నసహాయ, పునరావాస చర్యలపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో చరవాణి ద్వారా మాట్లాడారు. బాధితులకు సత్వర సహాయం అందించే దిశగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాననీయ గవర్నర్ కు వివరించారు.  జిల్లా యంత్రాంగం  చేపట్టిన వేగవంతమైన చర్యలతో పాటు,  ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించడం, సాయిధ దళాలు స్వచ్ఛందంగా సహాయ చర్యలలో పాల్గొనటం వంటి అంశాలను గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి వివరించారు.


               సహాయ, తాత్కాలిక పునరావాస కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని, వివిధ శాఖల మధ్య సమన్వయంతో బాధితులకు మెరుగైనా సేవలు అందుతున్నాయని సిఎం గవర్నర్‌కు తెలియజేశారు. ఈ సంఘటనలో ఎనిమిది మంది మరణించారని, మూడువందలకు పైగా ప్రజలు ఆసుపత్రులలో ప్రాణాపాయ స్దితిలో ఉన్నారని గవర్నర్ గుర్తించారు. బాధిత వ్యక్తులకు ఆస్పత్రులలో అత్యున్నత వైద్యం అందించాలని గవర్నర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాద ఫలితంగా మృతి చెందిన వారి కుటుంబ  సభ్యులకు గౌరవ గవర్నర్ తీవ్ర సంతాపం తెలిపారు. చికిత్స పొందుతున్న బాధితులు వేగంగా కోలుకోవాలన్న ఆశాభావం వ్యక్తం చేసారు. మరోవైపు గవర్నర్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహించే రెడ్ క్రాస్ వ్యవస్ధను సమాయత్త పరిచిన బిశ్వ భూషన్ సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశించటమే కాక, రెడ్ క్రాస్ వైద్య  బృందాలు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేలా చూడాలని రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు సూచించారు. అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాల రెడ్ క్రాస్ వాలంటీర్లు కూడా సేవా కార్యక్రమాలలో పాల్గొనేలా చూడాలన్నారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image