వైకాపా నాయకులకు   జె ట్యాక్ష్ మీద ఉన్న శ్రద్ధ   విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు :అనగాని సత్యప్రసాద్


3-05-2020
అనగాని సత్యప్రసాద్ 
రేపల్లె శాసనసభ్యులు


వైకాపా నాయకులకు   జె ట్యాక్ష్ మీద ఉన్న శ్రద్ధ   విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు. 


రేయనక పగలనక  కష్టించి  చదువుకున్న   పదవ తరగతి విద్యార్థులకు  కరోనా సాకుతో  పరీక్షలు వాయిదా వేసి  వారి  భవిష్యత్తును అంధకారంలో పడవేశారు.  భౌతిక దూరం పాటించి పరీక్షలు నిర్వహించ లేరా?  పరీక్షలు వాయిదా వేయడంతో  పదో తరగతి విద్యార్థులు  తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.  విద్యార్థులకు అండగా నిలిచి  విద్యార్థుల్లో మనోధైర్యం నింపే విధంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు  చేపట్టకపోవడం సిగ్గుచేటు. ఆదాయం పెంచుకోవడానికి ఆరాటపడుతున్నారు తప్ప  పదో తరగతి  విద్యార్థుల పరీక్షలు  నిర్వహించడానికి  ఏ పరిష్కార మార్గం  ప్రభుత్వం  సూచించలేదు.  ఎప్పటి లోపు  పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారో  ప్రభుత్వం చెప్పాలి?  పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో  తెలియక  విద్యార్థులు వారి తల్లిదండ్రులు  ఆందోళన చెందుతుంటే  ప్రభుత్వానికి  కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఆదాయం తగ్గుతుందనే  బాధ తప్ప  విద్యార్థుల బాధలు పట్టవా?  ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలు   కరోనాను  సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు   మత్తు పదార్థాలు,  మాదకద్రవ్యాలను  నిషేధిస్తే  ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం  మద్యం అమ్మకాలకు  సీఎం జగన్ పచ్చజెండా ఊపడం  దేనికి సంకేతం?   మద్యం ఏమన్నా  నిత్యావసర సరుకా?  అత్యవసర సేవా వైకాపా నాయకులు చెప్పాలి?  మీ జె  ట్యాక్ష్ కక్కుర్తితో  రాష్ట్రం పరువు తీస్తున్నారు.   కరోనా మహమ్మారిని    సమర్థవంతంగా ఎదుర్కోవడానికి  స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తే  నిస్సిగ్గుగా  ఎన్నికల కమిషనర్ పై కుల  దూషణలకు పాల్పడిన వైకాపా నాయకులు  పదవ తరగతి  పరీక్షల గురించి మాట్లాడకపోవడం  బాధాకరం?  సేవాభావంతో పాలించ వలసిన సీఎం  లాభాపేక్ష కోసం వ్యాపారి లాగా  మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇస్తూ  ప్రజా ఆరోగ్యం తో చెలగాటమాడుతున్నారు.   నేటి బాలలే  రేపటి పౌరులు  కానీ జగన్ దృష్టిలో మాత్రం  నేటి   మద్యం అమ్మకాలే  రేపటి   జె ట్యాక్ష్ కు   ఆదాయ మార్గాలు అన్నట్లు  మద్యం అమ్మకాలను  ప్రోత్సహిస్తున్నారు.  మద్యం తాగిన వ్యక్తులు  సామాజిక దూరం పాటిస్తారా?   మద్యం  ఏమైనా కరోనాకు  మందా?  సామాజిక దూరం  పాటింప చేస్తూ పరీక్ష  నిర్వహించలేని  ఈ అసమర్థ  విద్యా శాఖ మంత్రి  రాజీనామా చేయాలి?   నిర్వహించిన శాఖలకే  వన్నెతెచ్చిన  మంత్రుల నుంచి  శాఖలను భ్రష్టు పట్టించిన  మంత్రుల స్థాయికి   జగన్  దిగజార్చడం  ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం.


                                                         S/d
                                         అనగాని సత్యప్రసాద్ 
                                          రేపల్లెశాసనసభ్యులు


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image