మధ్యం షాపుల వద్ద నిబంధనలు పాటించాలి :- వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి

మధ్యం షాపుల వద్ద నిబంధనలు పాటించాలి :- వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి


వింజమూరు, మే 6 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): మద్యం షాపుల వద్ద అటు నిర్వాహకులు గానీ, ఇటు మద్యం ప్రియులు కానీ ఖచ్చితంగా లాక్ డౌన్ నిబంధనలను పాటించాల్సిందేనని వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం నాడు ఆయన పలు మద్యం షాపుల ప్రాంతాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాఫు. ఎస్.ఐ వాహనాన్ని గమనించి మద్యం దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా ఉన్న మందుబాబులు పరుగులందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ విషయంలో షాపుల నిర్వాహకులు కరోనా వైరస్ కట్టడి లక్ష్యంగా భాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినా కొన్ని నియమ నిబంధనలతో పాటు పరిమితులను కూడా తెలియజేయడం జరిగిందన్నారు. షాపుల ముందు భాగంలో సమదూరం పాటించే విధంగా మార్కింగులు వేయాలని నిర్వాహకులకు సూచించారు. మాస్కులు ధరించిన వారికే మద్యం ఇవ్వాలన్నారు. మద్యం కొనుగోలు సమయంలో గుంపులు గుంపులుగా ఉండకుండా కౌంటర్ల వద్ద ఉంటున్న నిర్వాహకులే అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం ప్రియులు కూడా గతంలో మాదిరిగా మద్యం సేవించి రోడ్లుపై సంచరించరాదన్నారు. పూటుగా మద్యం సేవించి వీధుల వెంబడి తిరగడం, ద్విచక్రవాహనాలలో డబుల్, త్రిబుల్ వెళ్ళడం వాంటివి ఉపేక్షించబోమని ఎస్.ఐ బాజిరెడ్డి స్పష్టం చేశారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image