నేడు బ్రాహ్మణులకు చేయూతనివ్వనున్న గణపం.బాలక్రిష్ణారెడ్డి

నేడు బ్రాహ్మణులకు చేయూతనివ్వనున్న గణపం.బాలక్రిష్ణారెడ్డి


వింజమూరు, మే 4 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరులోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం వద్ద బ్రాహ్మణ పండితులకు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నామని వింజమూరు మాజీ మండలాధ్యక్షులు, వై.సి.పి జడ్.పి.టి.సి అభ్యర్ధి గణపం.బాలక్రిష్ణారెడ్డి, ఆయన సతీమణి మాజీ జడ్.పి.టి.సి సభ్యురాలు గణపం.సుజాతమ్మలు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా గణపం.బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి మారుమూల ప్రాంతాలకు సైతం సోకడం విషాదకరమన్నారు. ఈ వైరస్ నియంత్రణలో భాగంగా మన దేశ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలు పతనమవుతున్నప్పటికీ ప్రజల సం రక్షణ, సం క్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు కృషి చేస్తుండటం అభినందనీయమన్నారు. అయితే లాక్ డౌన్ సమయంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కొంతమేర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనులు లేకపోవడంతో పలు ప్రాంతాల పేదలు పస్తులుండాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అందులో భాగంగా ఇటీవల 3 టన్నుల కూరగాయలను తమ స్వంత నిధులతో పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో దైవత్వం ఫరిఢవిల్లే ఆలయాలకు కూడా లాక్ డౌన్ నిబంధనలు వర్తించడంతో అర్చకుల జీవనగమనం ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తన పినతండ్రి గణపం.ఓబులురెడ్డి జ్ఞాపకార్ధం ఆయన సతీమణి సౌజన్యంతో బ్రాహ్మణులకు నిత్యా వసర సరుకులను పంపిణీ చేయనున్నామన్నారు. ఈ కరోనా కష్టకాలంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు వింజమూరు మండలంలో పలువురు దాతలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కూరగాయలు, వంట సరుకులు అందజేయడం శుభపరిణామని ఈ సందర్భంగా గణపం.బాలక్రిష్ణారెడ్డి దాతలందరికీ పేరు పేరునా ధన్యవాదములు తెలియజేశారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image