నేడు బ్రాహ్మణులకు చేయూతనివ్వనున్న గణపం.బాలక్రిష్ణారెడ్డి

నేడు బ్రాహ్మణులకు చేయూతనివ్వనున్న గణపం.బాలక్రిష్ణారెడ్డి


వింజమూరు, మే 4 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరులోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం వద్ద బ్రాహ్మణ పండితులకు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నామని వింజమూరు మాజీ మండలాధ్యక్షులు, వై.సి.పి జడ్.పి.టి.సి అభ్యర్ధి గణపం.బాలక్రిష్ణారెడ్డి, ఆయన సతీమణి మాజీ జడ్.పి.టి.సి సభ్యురాలు గణపం.సుజాతమ్మలు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా గణపం.బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి మారుమూల ప్రాంతాలకు సైతం సోకడం విషాదకరమన్నారు. ఈ వైరస్ నియంత్రణలో భాగంగా మన దేశ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలు పతనమవుతున్నప్పటికీ ప్రజల సం రక్షణ, సం క్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు కృషి చేస్తుండటం అభినందనీయమన్నారు. అయితే లాక్ డౌన్ సమయంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కొంతమేర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనులు లేకపోవడంతో పలు ప్రాంతాల పేదలు పస్తులుండాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అందులో భాగంగా ఇటీవల 3 టన్నుల కూరగాయలను తమ స్వంత నిధులతో పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో దైవత్వం ఫరిఢవిల్లే ఆలయాలకు కూడా లాక్ డౌన్ నిబంధనలు వర్తించడంతో అర్చకుల జీవనగమనం ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తన పినతండ్రి గణపం.ఓబులురెడ్డి జ్ఞాపకార్ధం ఆయన సతీమణి సౌజన్యంతో బ్రాహ్మణులకు నిత్యా వసర సరుకులను పంపిణీ చేయనున్నామన్నారు. ఈ కరోనా కష్టకాలంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు వింజమూరు మండలంలో పలువురు దాతలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కూరగాయలు, వంట సరుకులు అందజేయడం శుభపరిణామని ఈ సందర్భంగా గణపం.బాలక్రిష్ణారెడ్డి దాతలందరికీ పేరు పేరునా ధన్యవాదములు తెలియజేశారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image