బుక్కాపురంలో వై.సి.పి నేతలచే కూరగాయలు పంపిణీ

బుక్కాపురంలో వై.సి.పి నేతలచే కూరగాయలు పంపిణీ


వింజమూరు, మే 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని బుక్కాపురం గ్రామంలో శుక్రవారం నాడు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటికీ కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మండలాధ్యక్షుడు గణపం.బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ఉహించని రీతిలో మానవాళి మనుగడకు పెను ప్రమాదంగా పరిణమించిన కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి
చంద్రశేఖర్ రెడ్డి ఆశయాలు, ఆదేశాలకు అనుగుణంగా ప్రజల ఇబ్బందులను గుర్తెరిగి కూరగాయలు అందజేస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా లాక్ డౌన్ సమయంలో స్వీయ నిర్భంధంలో ఉండి కరోనా కట్టడికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా దాత కాటం.శ్రీనివాసులురెడ్డిని వై.సి.పి నేతలు అభినందించారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల కన్వీనర్ మలిరెడ్డి.విజయకుమార్ రెడ్డి, వై.సి.పి యువజన విభాగం నేత గణపం.రమేష్ రెడ్డి, స్థానిక వై.సి.పి నేతలు కాటం.రమణారెడ్డి, యర్రా.భాస్కర్ నాయుడు, సిద్ధం రెడ్డి.రాజగోపాల్ రెడ్డి, బి.తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image