_నేనున్నాను...అంటూ బండి వేణుగోపాల్ రెడ్డి భరోసా_

*_నేనున్నాను...అంటూ బండి వేణుగోపాల్ రెడ్డి భరోసా_*


*పొదలకూరు పోలీసులకు సర్వేపల్లి ఎమ్మెల్యే చేతులు మీదుగా యూనిఫారం పంపిణీ*


*కరోనా కష్ట కాలంలో బండి వేణుగోపాల్ రెడ్డి చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం*


*వెంకటగిరి నియోజకవర్గంలోనే కాకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో వేణుగోపాల్ రెడ్డి సేవలు వినియోగించుకుంటాం*


*సర్వేపల్లి ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి వెల్లడి*


*పొదలకూరు*


కరోనా లాక్ డౌన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో రాపూరు మాజీ ఎంపీపీ, వైకాపా మండల కన్వీనర్ దివంగత మహానేత బండి క్రిష్ణారెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి  తన సొంత నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచి నేనున్నాను.. అంటూ భరోసా ఇస్తూ అదుకుంటున్నారు , ఇటీవల కాలంలో రాపూరు మండలం లోని 25 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు,కూరగాయలు,పండ్లు పంపిణి చేశారు.అలాగే కరోనా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న రాపూరు,డక్కిలి,కండలేరు పోలీసులకు నిత్యావసర సరుకులు,యూనిఫామ్ పంపిణీ చేసి మీకు ఏ అవసరమైన నన్ను సంప్రదిస్తే మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానాని ఆయన భరోసా ఇచ్చారు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 42 మందికి తన సొంత నిధులతో సమకూర్చిన యూనిఫామ్ ని శుక్రవారం పొదలకూరు పోలీస్ స్టేషన్లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి, వైస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు నూకరాజు మాదన్మోహన్ రెడ్డి పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ రావుతో కలిసి బండి వేణుగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బండి వేణుగోపాల్ రెడ్డి తండ్రి 
 స్వర్గీయ బండి క్రిష్ణా రెడ్డి రెడ్డి జ్ఞాపకర్థం ఆయన కుమారుడు వేణుగోపాల్ రెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని వెంకటగిరి నియోజకవర్గం కరోనా సాయం క్రింద రాపూరు మండలంలోని 25 వేల కుటుంబాలకు  నిత్యావసర వస్తువుల, కూరగాయలు,పండ్లు  పంపిణీ చైయడం,కరోనా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ శేభాష్ వేణుగోపాల్ రెడ్డి అని అనిపించుకుంటున్నారని ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి కొనియాడారు.సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు పోలీస్ సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేసిన బండి వేణుగోపాల్ రెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు,అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో మిగిలిన మండలాలు వెంకటాచలం, మనుబోలు, తోటపల్లి గూడూరు,ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి కూడా యూనిఫామ్ పంపిణీ చేయాలని బండి వేణుగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి కోరగా దానికి సానుకూలంగా,స్పందించినందుకు, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పింగాణీ హరిప్రసాద్ రెడ్డి,రాపూరు శ్రీనివాసులు పొదలకూరు ఎస్సై రహీంరెడ్డి తదితరులు ఉన్నారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image