_నేనున్నాను...అంటూ బండి వేణుగోపాల్ రెడ్డి భరోసా_

*_నేనున్నాను...అంటూ బండి వేణుగోపాల్ రెడ్డి భరోసా_*


*పొదలకూరు పోలీసులకు సర్వేపల్లి ఎమ్మెల్యే చేతులు మీదుగా యూనిఫారం పంపిణీ*


*కరోనా కష్ట కాలంలో బండి వేణుగోపాల్ రెడ్డి చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం*


*వెంకటగిరి నియోజకవర్గంలోనే కాకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో వేణుగోపాల్ రెడ్డి సేవలు వినియోగించుకుంటాం*


*సర్వేపల్లి ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి వెల్లడి*


*పొదలకూరు*


కరోనా లాక్ డౌన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో రాపూరు మాజీ ఎంపీపీ, వైకాపా మండల కన్వీనర్ దివంగత మహానేత బండి క్రిష్ణారెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి  తన సొంత నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచి నేనున్నాను.. అంటూ భరోసా ఇస్తూ అదుకుంటున్నారు , ఇటీవల కాలంలో రాపూరు మండలం లోని 25 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు,కూరగాయలు,పండ్లు పంపిణి చేశారు.అలాగే కరోనా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న రాపూరు,డక్కిలి,కండలేరు పోలీసులకు నిత్యావసర సరుకులు,యూనిఫామ్ పంపిణీ చేసి మీకు ఏ అవసరమైన నన్ను సంప్రదిస్తే మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానాని ఆయన భరోసా ఇచ్చారు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 42 మందికి తన సొంత నిధులతో సమకూర్చిన యూనిఫామ్ ని శుక్రవారం పొదలకూరు పోలీస్ స్టేషన్లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి, వైస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు నూకరాజు మాదన్మోహన్ రెడ్డి పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ రావుతో కలిసి బండి వేణుగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బండి వేణుగోపాల్ రెడ్డి తండ్రి 
 స్వర్గీయ బండి క్రిష్ణా రెడ్డి రెడ్డి జ్ఞాపకర్థం ఆయన కుమారుడు వేణుగోపాల్ రెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని వెంకటగిరి నియోజకవర్గం కరోనా సాయం క్రింద రాపూరు మండలంలోని 25 వేల కుటుంబాలకు  నిత్యావసర వస్తువుల, కూరగాయలు,పండ్లు  పంపిణీ చైయడం,కరోనా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ శేభాష్ వేణుగోపాల్ రెడ్డి అని అనిపించుకుంటున్నారని ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి కొనియాడారు.సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు పోలీస్ సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేసిన బండి వేణుగోపాల్ రెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు,అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో మిగిలిన మండలాలు వెంకటాచలం, మనుబోలు, తోటపల్లి గూడూరు,ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి కూడా యూనిఫామ్ పంపిణీ చేయాలని బండి వేణుగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి కోరగా దానికి సానుకూలంగా,స్పందించినందుకు, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పింగాణీ హరిప్రసాద్ రెడ్డి,రాపూరు శ్రీనివాసులు పొదలకూరు ఎస్సై రహీంరెడ్డి తదితరులు ఉన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image