ప్రజారంజక పాలన అందిస్తున్న సి.యం వై.యస్.జగన్ : పూనూరు.రామ మనోహర్ రెడ్డి. వింజమూరు, జూన్ 16 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన యేడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సం క్షేమ ఫలాలను అందిస్తూ ప్రజారంజక పాలనను సాగించడం అభినందనీయమని వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పూనూరు.రామ మనోహర్ రెడ్డి కొనియాడారు. వై.యస్.జగన్ మోహన్ రెడ్డి యేడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా నెల్లూరుజిల్లా చేజర్ల మండలంలోని తన స్వగ్రామమైన మడపల్లి నుండి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసిం హస్వామి దేవస్థానంకు పూనూరు.రామ మనోహర్ రెడ్డి తన సన్నిహితులతో నిరంతర పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 15 వ తేదీ సోమవారం ఉదయం నుండి ప్రారంభించిన పాదయాత్ర మంగళవారం రాత్రికి వింజమూరుకు చేరుకుంది. వింజమూరులో వై.సి.పి నేతలు మాజీ మండలాధ్యక్షులు గణపం.బాలక్రిష్ణారెడ్డి, గణపం.క్రిష్ణకిరణ్ రెడ్డిలు, మండల మాజీ వై.సి.పి కన్వీనర్లు మలిరెడ్డి.విజయకుమార్ రెడ్డి, గువ్వల.క్రిష్ణారెడ్డిలు రామ మనోహర్ రెడ్డి బృందం సభ్యులకు స్థానిక శివాలయం వద్ద ఘన స్వాగతం పలికి బంగ్లాసెంటర్ వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూనూరు.రామ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వై.యస్.జగన్ మోహన్ రెడ్డి యేడాది పాలనలో తన మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలను 90 శాతం పూర్తి చేసి దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేసిన అరుదైన ఘనతను దక్కించుకున్నారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా, మాట తప్పని-మడమ తిప్పని నేతగా ఆంధ్రప్రదేశ్ లో సుభిక్ష పరిపాలనను అందిస్తున్నారని రామ మనోహర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖా మాత్యులు మేకపాటి. గౌతం రెడ్డి ఆశీస్సులతో పాదయాత్రను ప్రారంభించగా ఉదయగిరి నియోజకవర్గంలో మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి.రాజమోహన్ రెడ్డి, యం.యల్.ఏ మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి అనుయాయులు తమ పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికి తేనీటి విందును అందించడం మరుపురాని అనుభూతిగా రామ మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం రాత్రికి స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిధిగృగంలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ కార్యక్రమాలలో రామ మనోహర్ రెడ్డి సన్నిహితులు మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామానికి చెందిన మల్లు.శ్రీనివాసులురెడ్డి, ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామానికి చెందిన చేజర్ల.జయరామిరెడ్డి, జె.జె పేటకు చెందిన సుబ్బరామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image