*నందిగుంటలో ఉపాధిహామీ పనులు తనిఖీ* వింజమూరు, జూన్ 16 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ పరిసరాలలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులను మంగళవారం ఉదయం యం.పి.డి.ఓ ఎస్.కనకదుర్గా భవాని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీనియర్ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల వద్ద ఉన్న మస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మస్టర్లలో నమోదు చేసి ఉన్న పేర్లు ప్రకారం కూలీల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా యం.పి.డి.ఓ మాట్లాడుతూ జాబ్ కార్డులు కలిగి ఉన్న వారినే పనులలోకి అనుమతించాలని, ఒకరికి బదులు మరొకరితో ఉపాధిహామీ పనులు చేయించిన పక్షంలో ఉపేక్షించేది లేదని ఫీల్డ్ అసిస్టెంట్లును హెచ్చరించారు. గ్రామాలలో వలసలను నివారించేందుకు గానూ అర్హులైన ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేస్తూ నూతనంగా జాబ్ కార్డులను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని పనులు చేసే సమయంలో కూలీలు భౌతికదూరం పాటించాలన్నారు. మాస్కులను తప్పనిసరిగా ధరించాలని కూలీలకు విజ్ఞప్తి చేశారు. ఎండ తీవ్రతను బట్టి కూలీల సం రక్షణ దిశగా ఎన్.ఆర్.ఇ.జి.యస్ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలుగా శుద్ధి జలాలు, నీడను కల్పించే పట్టలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కూలీల శ్రమకు తగిన ఫలితాలనిచ్చే దిశగా ఖచ్చితమైన కొలతలను రికార్డులలో పొందుపరచాలని సిబ్బందికి సూచించారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు