*వింజమూరు-కలిగిరి మార్గంలో రోడ్డు ప్రమాదం* ఒకరు మృతి... వింజమూరు, జూన్ 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు-కలిగిరి ప్రధాన మార్గంలో కావలి-కడప మెయిన్ రోడ్డుపై కలిగిరి మండలంలోని నాగసముధ్రం పంచాయితి పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కలిగిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవికిరణ్ అందించిన సమాచారం మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన పెంచలయ్య అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు. సంఘటన జరిగిన తీరును బట్టి పెంచలయ్య ద్విచక్ర వాహనంపై నుండి పడిపోయి చనిపోయాడా లేక ఏదైనా వాహనం ఢీకొని మృతి చెందాడా అనే విషయం దర్యాప్తులో వెల్లడి కావల్సి ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ రాత్రి 7:30 గంటల సమయంలో ప్రమాదం జరిగి ఉంటుందన్నారు. ఆయా మార్గాలలో అదే సమయంలో ప్రయాణించిన వాహనాలను సి.సి కెమెరాల పుటేజీల ఆధారంగా పరిశీలించనున్నామన్నారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా సి.ఐ వెంట కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వారి సిబ్బంది ఉన్నారు.