*మొక్కజొన్న బస్తాల మాటున రేషన్ బియ్యం స్మగ్లింగ్* లారీని పట్టుకున్న పోలీసులు...... ఉదయగిరి, జూన్ 28 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యమును అక్రమార్కులు వివిద పద్దతులలో అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా మొక్కజొన్న బస్తాల మాటున రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కిన సంఘటన ఉదయగిరి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే ఉదయగిరి మండలంలోని శకునాలపల్లి సమీపంలో మొక్కజొన్న బస్తాల మధ్యలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం స్థానిక పోలీసులుకు అందింది. వెంటనే అప్రమత్తమైన సి.ఐ ఉప్పాల.సత్యనారాయణ, ఎస్.ఐ జ్యోతిలు నిఘా ఉంచి బియ్యంతో పాటుగా లారీని స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. విచారణ, పరిశీలన నిమిత్తం ఈ సమాచారమును విజిలెన్స్ అధికారులకు తెలిపామని సి.ఐ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉదయగిరి ప్రాంతంలో తరచూ ఏదో ఒక చోట అక్రమంగా రేషన్ బియ్యం లారీలు తరలుతూనే ఉన్నాయి. చౌక దుకాణాల నుండి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు నిరంతర నిఘా ఉంచాల్సిన సంబంధిత అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతున్నారనే విమర్శలు బహిరంగ సత్యమే. ఆ శాఖ తీరు ' నిండా ఉన్న చేపల చెరువుకు కొంగల గుంపును కాపలా పెట్టిన ' చందంగా తయారైందని పలువురు పెదవి విరుస్తున్నారు. డీలర్ల వద్ద నుండి అక్రమార్కులు యధేచ్చగా బియ్యం నిల్వలను పొంది అక్రమ మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్బడుతున్నారు. లారీలు పట్టుబడిన సమయాలలో బియ్యం ఎక్కడి నుండి అక్రమంగా తరలుతున్నాయనే విషయాలు సంబంధిత రెవిన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకున్న దాఖలాలు చాలా అరుదుగానే ఉంటున్నాయి.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు