*మొక్కజొన్న బస్తాల మాటున రేషన్ బియ్యం స్మగ్లింగ్* లారీని పట్టుకున్న పోలీసులు...... ఉదయగిరి, జూన్ 28 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యమును అక్రమార్కులు వివిద పద్దతులలో అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా మొక్కజొన్న బస్తాల మాటున రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కిన సంఘటన ఉదయగిరి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే ఉదయగిరి మండలంలోని శకునాలపల్లి సమీపంలో మొక్కజొన్న బస్తాల మధ్యలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం స్థానిక పోలీసులుకు అందింది. వెంటనే అప్రమత్తమైన సి.ఐ ఉప్పాల.సత్యనారాయణ, ఎస్.ఐ జ్యోతిలు నిఘా ఉంచి బియ్యంతో పాటుగా లారీని స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. విచారణ, పరిశీలన నిమిత్తం ఈ సమాచారమును విజిలెన్స్ అధికారులకు తెలిపామని సి.ఐ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉదయగిరి ప్రాంతంలో తరచూ ఏదో ఒక చోట అక్రమంగా రేషన్ బియ్యం లారీలు తరలుతూనే ఉన్నాయి. చౌక దుకాణాల నుండి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు నిరంతర నిఘా ఉంచాల్సిన సంబంధిత అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతున్నారనే విమర్శలు బహిరంగ సత్యమే. ఆ శాఖ తీరు ' నిండా ఉన్న చేపల చెరువుకు కొంగల గుంపును కాపలా పెట్టిన ' చందంగా తయారైందని పలువురు పెదవి విరుస్తున్నారు. డీలర్ల వద్ద నుండి అక్రమార్కులు యధేచ్చగా బియ్యం నిల్వలను పొంది అక్రమ మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్బడుతున్నారు. లారీలు పట్టుబడిన సమయాలలో బియ్యం ఎక్కడి నుండి అక్రమంగా తరలుతున్నాయనే విషయాలు సంబంధిత రెవిన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకున్న దాఖలాలు చాలా అరుదుగానే ఉంటున్నాయి.
Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
• Valluru Prasad Kumar
శ్రీవాణి ట్రస్టు దాతల కోసం ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం
• Valluru Prasad Kumar
ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్ సేవలు అమలు.
• Valluru Prasad Kumar
పౌష్ఠిక ఆహారం అందజేత
• Valluru Prasad Kumar
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn