విజయవాడ *ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ కామెంట్స్* ఎవడబ్బ సొమ్ము అని వైసీపీ ప్రభుత్వం పంచాయితీ కార్యాలయాలకు రంగులు వేశారు ? సుప్రీమ్ కోర్టు వరకు వెళ్లి అంధ్రప్రదేశ్ పరువు తీసి ఇప్పుడు మళ్ళీ ప్రజల సొమ్ముతో తెల్ల రంగు వేస్తున్నారు *డెత్ సర్టిఫికెట్ మీద కూడా ముఖ్యమంత్రి జగన్ తన బొమ్మ వేసుకున్నారు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు* సాధారణంగా గొప్ప నాయకుల పేర్లు పథకాలకు లేదా చనిపోయిన నాయకుల పేర్లు, బొమ్మలు వేస్తారు *కానీ ఏపీలో అంతా రివర్స్.... కార్పొరేషన్లు నిర్వహించే సులబ్ కాంప్లెక్స్ కి జగనన్న సులబ్ కాంప్లెక్స్ అని పెట్టిన ఆశ్చర్యం లేదు* మన ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రికి జైలుకి వెళ్తాను అని భయం లేదా మళ్ళీ ప్రజలు అవకాశం ఇవ్వరు అని అర్థం అయినట్లు ఉంది *అమరావతి రాజధానిగా ఉంటే చంద్రబాబు పేరు చిరస్ధాయిగా ఉంటుందని 3 రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారు* తెలుగు ప్రజల తరుపున ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం కావాలంటే "జగనన్న రాజధాని" "జగనన్న కాపిటల్" గా పేరు పెట్టుకోండి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడి, రాజధాని నిర్మాణం కోసం 33000 ఎకరాలు ఇచ్చిన రైతు కుటుంబాలకు న్యాయం చేయండి
Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
• Valluru Prasad Kumar
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
• Valluru Prasad Kumar
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
• Valluru Prasad Kumar
శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి దర్శనం
• Valluru Prasad Kumar
శ్రీవారి ఆలయంలోని మండపాలు - భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నపురాతన శిల్పాలు
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn