విజయవాడ *ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ కామెంట్స్* ఎవడబ్బ సొమ్ము అని వైసీపీ ప్రభుత్వం పంచాయితీ కార్యాలయాలకు రంగులు వేశారు ? సుప్రీమ్ కోర్టు వరకు వెళ్లి అంధ్రప్రదేశ్ పరువు తీసి ఇప్పుడు మళ్ళీ ప్రజల సొమ్ముతో తెల్ల రంగు వేస్తున్నారు *డెత్ సర్టిఫికెట్ మీద కూడా ముఖ్యమంత్రి జగన్ తన బొమ్మ వేసుకున్నారు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు* సాధారణంగా గొప్ప నాయకుల పేర్లు పథకాలకు లేదా చనిపోయిన నాయకుల పేర్లు, బొమ్మలు వేస్తారు *కానీ ఏపీలో అంతా రివర్స్.... కార్పొరేషన్లు నిర్వహించే సులబ్ కాంప్లెక్స్ కి జగనన్న సులబ్ కాంప్లెక్స్ అని పెట్టిన ఆశ్చర్యం లేదు* మన ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రికి జైలుకి వెళ్తాను అని భయం లేదా మళ్ళీ ప్రజలు అవకాశం ఇవ్వరు అని అర్థం అయినట్లు ఉంది *అమరావతి రాజధానిగా ఉంటే చంద్రబాబు పేరు చిరస్ధాయిగా ఉంటుందని 3 రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారు* తెలుగు ప్రజల తరుపున ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం కావాలంటే "జగనన్న రాజధాని" "జగనన్న కాపిటల్" గా పేరు పెట్టుకోండి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడి, రాజధాని నిర్మాణం కోసం 33000 ఎకరాలు ఇచ్చిన రైతు కుటుంబాలకు న్యాయం చేయండి