విజయవాడ పెట్రోల్ ధరలపై ప్రజలు గగ్గోలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆగ్రహం రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలపై పద్మశ్రీ వినూత్న నిరసన దున్నపోతుకు తాడు కట్టి బండిని లాగించి నిరసన వ్యక్తం చేసిన పద్మశ్రీ *ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ కామెంట్స్* పెట్రోల్ ధరలు పెరుగుతున్న కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడిన చందంగా ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గుతున్న భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 6 సంవత్సరాల్లో అడ్డగోలుగా పెట్రోల్ రేటును పెంచుతున్నారు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతుంది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడతారు లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రo 15 రోజుల వ్యవధిలో పెట్రోల్ రేటును 10రూపాయలు వరకు పెంచారు ప్రజలు ఏ ఇబ్బందులు పడితే మాకేంటి మా ఖజానా నిండితే చాలు అన్న చందంగా ఉంది కేంద్ర ప్రభుత్వ తీరు మన రాష్ట్రంలోనే చమురు నిక్షేపాలు ఉన్న మనకు ఎటువంటి ఉపయోగం లేదు రిలయన్స్ లాంటి సంస్థలకు ఆ సంపదను అప్పగించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తున్నాయి ముఖ్యమంత్రి జగన్ కేసులకు భయపడి ఈ సమస్యల మీద ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మోడీ ప్రాపకం కోసం కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు మోడీతో ఎలా జత కట్టాలి అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల ఇబ్బందులు ఆయనకు పట్టడం లేదు కేంద్ర ప్రభుత్వం విషయంలో వైసీపీ, టీడీపీలు దొందు దొందేలాగా వ్యవహరిస్తున్నాయి పెట్రోల్ ధరలు, కరోనా వైరస్ విజృంభణ చేస్తున్న, చైనా దురాక్రమణ వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని దుస్థితిలో వైసీపీ, టీడీపీ ఉన్నాయి ముఖ్యమంత్రి జగన్ ఇకనైన స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పెట్రోల్ ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టాలి.