*నెల్లూరు కేంద్రంలో ఐసోలేషన్ బెడ్లు ఖాళీ లేవా...? వింజమూరులోనే పాజిటివ్ సోకిన యువకుడు....భయాందోళన చెందుతున్న ప్రజలు....అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు..... వింజమూరు, జూలై 13 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ నియంత్రణ విషయంలో నిరంతరం కృషి చేస్తున్నామని పదే పదే ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. సాక్షాత్తూ కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని నెల్లూరులోని ఐసోలేషన్ కేంద్రంలో ఉంచకుండా వింజమూరులో బాధితుడి స్వగృహానికే తరలించి సంబంధిత అధికారులు తమ రాజనీతిని చాటుకున్న వైనమిది. అధికారుల తీరు పట్ల ప్రజలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వివరాలలోకి వెళితే గతంలో పలు మండలాలలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం నిర్వహించిన మాజీ అధికారి కుమారుడు ఇతర రాష్ట్రం నుండి వస్తుండగా అతనికి విజయవాడలో అక్కడి అధికారులు కరోనా టెస్టులు నిర్వహించినట్లు సమాచారం. అయితే రిపోర్టులలో సదరు యువకుడికి కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ జరిగింది. వింజమూరులో ఉన్న ఆ యువకుడిని వెంటనే జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఇక్కడి అధికారులు ఏం చేశారో తెలుసా.... అంబులెన్సులో పాజిటివ్ సోకిన వ్యక్తిని నెల్లూరుకు తరలించి అక్కడ ఐసోలేషన్ వార్డులు ఖాళీ లేవని, బెడ్లు లేవని తిరిగి వింజమూరులోని స్వగృహానికి బాధితుడిని తరలించారు. ఈ పరిణామంతో స్థానిక ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. సంబంధిత అధికారుల వ్యవహారశైలిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం ఉంటే నానా హడావిడి చేసి బాధితులను ఆసుపత్రులకు తరలిస్తున్న అధికారులు ఏకంగా కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఇంట్లోనే ఉంచడంలో ఆంతర్యమే