*సచివాలయాలను తనిఖీ చేసిన తహసిల్ధారు* వింజమూరు, జూలై 3 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మేజర్ పంచాయితీలోని గ్రామ సచివాలయాలను శుక్రవారం నాడు తహసిల్ధారు సుధాకర్ రావు తనిఖీ చేశారు. 1,2,3,4 సచివాలయాలకు వెళ్ళిన ఆయన రికార్డులను పరిశీలించారు. ప్రధానంగా మూవ్ మెంట్ రిజిష్టర్లును పక్కాగా నిర్వహించాలని సచివాలయాల ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తహసిల్ధారు మాట్లాడుతూ ప్రజలకు మరింతగా క్షేత్ర స్థాయిలో సేవలందించేందుకు ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సచివాలయాలలోనే ప్రజలకు అవసరమైన సేవలను పొందవచ్చునన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రధాన కార్యాలయాలకు రాకుండానే సచివాలయాలకు వెళ్ళి అక్కడి సిబ్బందికి తమ తమ సమస్యలు తెలియజేసి పరిష్కరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత గడువులోగా ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమాలలో మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, నాగిరెడ్డి, ప్రవీణ, నరేంద్ర తదితరులున్నారు.