*ఉపాధ్యాయులకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు?: సుంకర పద్మశ్రీ* విజయవాడ: ఓవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోందని.. ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్‌కు కనిపించడం లేదా అని ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ వారానికి ఒకటి... రెండు రోజులు స్కూల్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనమన్నారు. పసిపిల్లల ప్రాణాలతో జగన్ ఆటలాడుకుంటున్నారన్నారు. పిల్లలకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు.