*ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా శ్రీనివాసులురెడ్డి* వింజమూరు, ఆగష్టు 22 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి, వింజమూరు మరియు చాకలికొండ పంచాయితీల సమన్వయ సెక్రటరీ బంకా. శ్రీనివాసులురెడ్డి ఎంపికయ్యారు. ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సంధర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారుల పేర్లును జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించడం ఆవవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా ఈ యేడాది శ్రీనివాసులురెడ్డి ఉత్తమ అధికారుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత 5 సంవత్సరాల క్రితం మండలంలోని చాకలికొండ పంచాయితీ కార్యదర్శిగా నియమింపబడిన బంకా. శ్రీనివాసులురెడ్డి విధి నిర్వహణలో భాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమర్ధవంతమైన పంచాయితీ సెక్రటరీగా పేరు తెచ్చుకున్నారు. తరువాత ఆయనను వింజమూరు మేజర్ పంచాయితీ ఇంచార్జ్ ఇ.ఓగా కూడా ఉన్నతాధికారులు నియమించడం జరిగింది. చురుకైన స్వభావం కలిగిన శ్రీనివాసులురెడ్డి ప్రస్తుతం మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి గా అదనపు విధులలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలో వింజమూరులో శ్రీనివాసులురెడ్డి సేవలు పతాక శీర్షికలలో నిలిచాయి. పారిశుద్ధ్యం మెరుగుకు పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులను ముందుండి నడిపించారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలలో పగలూ రేయీ అనే తేడా లేకుండా నిరంతర పర్యటనలు చేసి బ్లీచింగ్, హైపోక్లోరెడ్ ద్రావణాలు చల్లించి సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసులురెడ్డి ఉత్తమ పంచాయితీ సెక్రటరీగా ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు గానూ విధి నిర్వహణలో తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, తహసిల్ధారు సుధాకర్ రావు, రక్షణ వలయాధికారి బాజిరెడ్డి తదితర మండల స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు, సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లుకు, జర్నలిస్టులకు, వింజమూరు, చాకలికొండ గ్రామ పంచాయితీల ప్రజలకు ధన్యవాదములు తెలియజేశారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image