*పేకాట స్థావరంపై పోలీసుల దాడి...* ఉదయగిరి, సెప్టెంబరు 10 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజక వర్గంలోని కలిగిరి మండలం చీమలవారిపాలెం గ్రామంలో గురువారం సాయంత్రం కలిగిరి ఎస్. ఐ. వీరేంద్ర బాబు తన సిబ్బందితో పేకాట స్థావరం పై అకస్మిక దాడులు జరిపారు. ఈ దాడులలో నలుగురు పేకాట రాయుళ్ళు ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్. ఐ తెలిపారు. ఈ పేకాట రాయుళ్ళు నుంచి 1150 రూపాయల నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా అయన పేర్కొన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో అసాంఘిక కార్యక్రమాలను ఉపేక్షించబోమని అన్నారు. పేకాట, కోడి పందాలు, నిషేద గుట్కా విక్రయాలు, అక్రమ మద్యం విక్రయాలు గురించి ప్రజలు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.