*కలిగిరిలో ఇసుక టిప్పర్ ల హోరు...* ఉదయగిరి, సెప్టెంబరు 12 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో స్థానిక రెవెన్యూ ఆఫీస్ సెంటర్ లోని ప్రజలు ఇసుక టిప్పర్ ల హోరు కు భయంతో బెంబేలెత్తి పోతున్నారు. సంగం మరియు బుచ్చి నుంచి కావలి పరిసర ప్రాంతాల కు పోయె ఇసుక టిప్పర్ లు హైవే నుంచి పోకుండా టోల్ గేట్ లు తప్పించుకుంటూ కలిగిరి నుంచి కావలి కి వెళ్తూ ఉండటంతో ఈ మార్గంలోని రోడ్లన్నీ గుంతలు పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పది పన్నెండు టన్నులు ఇసుక అని చెబుతూ 25 నుంచి ముప్పై టన్నుల వరకు ఇసుక టిప్పర్లు రోజుకీ యాభై వరకు ఈ మార్గంలో వస్తుండటంతో అటు ప్రయాణికులు ఇటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విధంగా ఈ టిప్పర్లు ఈ మార్గం లో వస్తుంటే రానున్న వర్షా కాలంలో ఈ మార్గంలోని రోడ్లు పూర్తిగా గుంతలు పడి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని మండల ప్రజలు భయాందోళనలు చెందు తున్నారు.