*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
• Valluru Prasad Kumar
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
• Valluru Prasad Kumar
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
• Valluru Prasad Kumar
సమాజ చైతన్యమే మన ఆయుధం కావాలి... * ఎస్జెఆర్వో తొలి రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు పిలుపు విజయవాడ: నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం సంస్థ సభ్యులందరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్ (ఎస్జెఆర్వో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు పిలుపునిచ్చారు. ఎస్జెఆర్వో రాష్ట్ర స్థాయి తొలి ఎగ్జిక్యూటీవ్ సమావేశాన్ని శనివారం ఉదయం విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జక్కా సాయిబాబు మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో జరుగుతున్న అవినీతి, ఆశ్రిత పక్షపాతం కారణంగా నష్టపోతున్న పౌరుల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తేవడమే లక్ష్యంగా సామాజిక బాధ్యతగా భావించి సంస్థ సభ్యులు పనిచేయాలని కోరారు. సమాజంలో మార్పు రావాలని కోరుకునే ప్రతి వ్యక్తిని గుర్తించి వారితో కలిసి పనిచేయడం సంస్థ లక్ష్యాల్లో ఒకటని పేర్కొన్నారు. సమాజంలో పెరిగిపోతున్న కాలుష్యం, తగ్గిపోతున్న నైతిక విలువలు, ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పులు వంటి అంశాలపై సభ్యులు నిరంతరం గుర్తుచేసుకుంటూ, లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం సామాన్య పౌరులను కలుపుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వారి పరిష్కారం సులువవుతుందన్నారు. 7 దశాబ్ధాల క్రితం దేశ స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా పనిచేసిన సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందుగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేసి సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందిస్తామని ప్రమాణం చేయించారు. పర్యావరణ హితం కోసం గ్రో గ్రీన్, గ్రీన్ ఇండియా, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాలు చేపట్టి మనిషిలా జీవించాలని కోరారు. సమావేశానికి ఎస్జెఆర్వో మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి ధాత్రి అధ్యక్షత వహించగా కృష్ణా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నాప్రగఢ ప్రసాద్, కొంకిమళ్ళ శంకర్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కె.భాగ్యలక్ష్మీ, వివిధ జిల్లాల నుంచి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
• Valluru Prasad Kumar
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn