*నేడు యం.యల్.ఏ మేకపాటి చే సచివాలయాలు ప్రారంభం* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో నేడు సోమవారం ఉదయం నూతన సచివాలయ భవనాలకు ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి. చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేయనున్నారని మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి నారపరెడ్డి, మండల వై.సి.పి యం.పి.పి అభ్యర్ధి పల్లాల.కొండారెడ్డి, మద్దురి. చిన్నికృష్ణ రెడ్డి, బోర్ వెల్స్ రాజా, యువజన నాయకుడు పోరెడ్డి జగన్, కాటేపల్లి, చాకలికొండ గ్రామాల నేతలు బండి క్రిష్ణారెడ్డి, మండాది గోవిందరెడ్డి, జక్కం.మోహన్ రెడ్డి, పోలుబోయిన వెంకటేశ్వర్లులు, మబ్బు.ప్రసాద్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పధకాలను ప్రజల ఇంటి వద్దకే చేర్చే లక్ష్యాలలో భాగంగా యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇందులో భాగంగా దాదాపుగా 40 లక్షల రూపాయల వ్యయంతో కొత్త భవానాలు నిర్మించడం జరుగుతుందన్నారు. కాటేపల్లి గ్రామంలో ఉదయం 9 గంటలకు, చాకలికొండలో ఉదయం 10 గంటలకు నూతన సచివాలయ భవనాలను యం.యల్.ఏ మేకపాటి. చంద్రశేఖర్ రెడ్డి లాంచనంగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. కనుక ఈ కార్యక్రమాలకు వై.సి.పి నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.