గుంటూరు పార్టీ కార్యాలయంలో టిడిపి నేతలతో చంద్రబాబు భేటి
టిడిపి నేత వెంగయ్య హత్యను ఖండించిన చంద్రబాబు. అనాసాగరం మండలంలో దాడులు అనాగరికం. అడ్డుపడ్డ వెంగయ్య తల్లిని, కొడుకును కూడా గాయపరిచారు. నెల్లూరులో ఈ విధమైన దాడులు గతంలో లేవు. ప్రశాంతమైన జిల్లాలను రక్తసిక్తం చేస్తున్నారు.
జగ్గయ్యపేట సలీమ్ పై కత్తులతో దాడిచేశారు. వడ్డెర మహిళ నరసమ్మపై దౌర్జన్యం చేశారు.
కడప జిల్లా జమ్మలమడకలో 12ఎకరాల్లో పత్తి పంట నాశనం చేశారు. రైతుల బోర్ వెల్స్ ధ్వంసం చేశారు. చెరువు పోరంబోకు, డికె పట్టా అంటూ రైతులను వేధిస్తున్నారు, ఏపుగా ఎదిగిన పంటలను నాశనం చేస్తున్నారు. డికె పట్టాలు సాగుచేసే వైసిపి కార్యకర్తలకో న్యాయం, టిడిపి కార్యకర్తలకో న్యాయమా..?
పులివెందులలో నాగభూషణ రెడ్డి ఇల్లు కూలగొట్టారు. వైసిపి ప్రభుత్వం కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తోంది. చట్టాలను బేఖాతరు చేస్తోంది.
రాయదుర్గం నియోజకవర్గం బేలోడు లో టిడిపి కార్యకర్తలపై దాడిని ఖండించిన చంద్రబాబు.
గుంటూరు జిల్లా ఉంగుటూరులో మహిళలపై దాడులను ఖండించిన చంద్రబాబు. బిడ్డలపై దాడులు, భర్తలను జైళ్లకు పంపడం అన్యాయం. మహిళల ఉసురు పోసుకుంటున్నారు.
పండుగలను దాడులకు వేదికలుగా మార్చారు. వినాయకుని నిమజ్జనంలో, మొహర్రంలో దాడులకు పాల్పడ్డారు. పండుగ ఆనందం లేకుండా చేస్తున్నారు. రాళ్లు, నాటుకర్రలు,సీసాలతో మహిళలపై దాడులు అమానుషం. రాష్ట్రంలో ప్రశాంతంగా పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా చేశారు.
దాడులను ఖండించిన చంద్రబాబు