*రాజకీయ పద్మవ్యూహంలో రాయలసీమ - మన కర్తవ్య, కార్యాచరణ పై సదస్సు - సెప్టెంబర్ 15, 2019, నంద్యాల*
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రాంతాల పట్ల వివక్షకు వ్యతిరేకంగా బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై ఉద్యమం జరిగిన విషయం అందరికి విదితమే. ఈ ఉద్యమ ఫలితంగా అక్టోబర్ 1,1953 న తెలుగు రాష్ట్రం ఆవిర్భవించింది. నవంబర్ 1, 1956 న తెలంగాణా ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అదే తెలంగాణ ప్రాంతం 2014 జూన్ 2 న ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోవడంతో 1953 లో ఏర్పడిన తెలుగు రాష్ట్రమే నేడు కొనసాగుతున్నది. తెలుగు ప్రాంతంలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ఏర్పడబోయే తెలుగు రాష్ట్రంలో ప్రత్యేక కార్యాచరణ కై 1937 లోనే ఒప్పందాలు జరిగాయి. తదనంతరం జరిగిన అనేక పరిణామాల సందర్భంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ వెనుకబాటు తనంను గుర్తిస్తూ, ఈ ప్రాంతం అభివృద్ధికై సానుకూలంగా తీర్మాణాలు చేస్తున్నాయి.
అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ వెనుకబాటుతనంను గుర్తిస్తు అనేక ప్రతిపాదనలు చేస్తున్నప్పటికి, రాయలసీమకున్న నీటి వాటాను కూడా ఉపయోగించుకొనలేని పరిస్థితికి నెట్టి వేయబడింది. ఇక విద్యా, వాణిజ్య, ఆరోగ్య, ఉద్యోగ కల్పన, మౌళిక వసుతుల కల్పనలో కూడా తీవ్ర వివక్షకు గురౌతునే ఉంది.
అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ అభివృద్ధికి తీర్మానాలు చేస్తున్నాయి, కాని వాటి అమలకై కార్యాచరణ చేపట్టడంలో విఫలం అవుతున్నాయి. ఈ రాజకీయ పద్మవ్యూహం నుండి రాయలసీమను విజయవంతంగా బయటకు తీసికొని రావలసిన బాధ్యత ప్రతి రాయలసీమ అభిమాని పైన ఉంది. ఈ విషయమై రాయలసీమ అభిమానుల కర్తవ్య, కార్యాచరణ పై మదుమణి నర్సింగ్ హోం లోని కాన్ఫరెన్స్ హాల్, నంద్యాలలో సెప్టెంబర్ 15, 2019 న ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడమైనది. రాయలసీమ నాలుగు జిల్లాలు నుండి రైతు, విద్యార్థి, ఉద్యోగ, ప్రజా, మహిళా, న్యాయవాదుల, డాక్టర్ల సంఘం నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రాయలసీమ అభిమానులు ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగ విజ్ఞప్తి చేస్తున్నాము.
బొజ్జా దశరథ రామి రెడ్డి
అధ్యక్షులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి
కన్వీనర్, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక.