అమరావతి
16.9.2019
*రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ బొత్సా సత్యనారాయణ కామెంట్స్*
- శివప్రసాద్ మరణం పట్ల దిగ్భ్రాంతి చెందాం.
- ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాం.
– శివప్రసాద్ గారి మరణంపై వార్తలు క్షణక్షణం మారుతూ వస్తున్నాయి.
– కోడెల మృతికి గుండెపోటు కారణమంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
– మళ్ళీ వెంటనే గతరాత్రి ప్రమాదకరమైన ఇంజక్షన్ వేసుకున్నారని మరో వార్త ప్రసారం చేశారు.
– ఆ వెంటనే ఆయన గుండెపోటుతో మరణించారని, వత్తిడితో మృతిచెందినట్లు మరో వార్త ప్రసారం చేశారు.
– సీనియర్ రాజకీయ నాయకుడి మరణంపై పలు కథనాలు వస్తున్నప్పుడు వాటిపై సమగ్ర విచారణ జరగాలి.
– ఈ మేరకు తెలంగాణా ప్రభుత్వంను కోరుతున్నాము.
– సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని కోరుతున్నాం.
– గుండెపోటు... ఇంజక్షన్... ఉరి వేసుకున్నారని అంటున్నారు...
– ఏదైనా జరిగితే దగ్గరలోని ప్రముఖ ఆసుపత్రులు వున్నాయి.
– వీటిని కాదని కోడెలను బసవ తారకం కాన్సర్ ఆసుత్రికి తీసుకువెళ్లడం పట్ల సందేహాలు వ్యక్తవుతున్నాయి.
– తెలుగుదేశం పార్టీ నాయకులు కోడెల మరణంపై శవరాజకీయాలు చేస్తున్నారు.
– ప్రభుత్వ వత్తిడి వల్లే ఉరివేసుకున్నారంటూ చెబుతున్నారు.
– ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలి.
– ప్రభుత్వం కోడెలపై ఏనాడు వత్తిడి తేలేదు...కావాలని కేసులు పెట్టలేదు.
– కోడెల శివప్రసాద్ వల్ల నష్టపోయిన వారు పోలీసులను ఆశ్రయించడం వల్లే కేసులు నమోదయ్యాయి.
– దీనిని రాజకీయం చేయాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది.
– సంఘటనా స్థలంను కస్టడీలోకి తీసుకుని, కోడెలకు పోస్టుమార్టం చేయడం ద్వారా వాస్తవాలను వెలికితీయాలి.