ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?

అమరావతి
05.11.2019


*సచివాలయంలో మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్‌ మీట్ పాయింట్లు...*


- గత రెండు మూడు రోజులుగా ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నాయి.
- చంద్రబాబు అయిదేళ్లు సిఎంగా పనిచేశారు.
- సినిమాల్లో పాటలు విన్నట్లు.. 'అ' అంటే అమరావతి అని మాటలు చెప్పారు.
- చివరికి ఇండియా మ్యాప్ లో ఎపి రాజధాని ఎక్కడా కనిపించకుండా చేశాడు.
- తిరిగి సిఎం శ్రీ వైఎస్‌ జగన్‌ పైన వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు.
- చంద్రబాబు సిగ్గు, ఎగ్గు వదిలేశాడు. 
- అయిదేళ్లు సిఎంగా చేసి రాష్ట్ర రాజధానికి కనీసం అడ్రస్‌ కూడా లేకుండా చేశాడు. 
- 2 నెలల కిందటే రాష్ట్ర రాజధానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని చెప్పాను...
- ఎపీ రాజధానికి కనీసం చిరునామా లేకపోవడం సిగ్గు చేటని ప్రశ్నించాను. 
- రాష్ట్ర ప్రజలకు సొంత రాజధాని లేకుండా చేశారు. 
- దీనిని ప్రశ్నించినందుకు నాపై చంద్రబాబు, ఆయన సహచరులు విమర్శలు చేశారు. 
- బొత్స ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు.  
-  ఇప్పుడు కేంద్రం ఇచ్చిన మ్యాప్‌ లో ఎపి రాజధాని ఎందుకు లేదో సమాధానం చెప్పాలి.
- చంద్రబాబు తోకలుగా వున్న బిజెపి నేతలు దీనికి వంత పాడుతున్నారు. 
- ఆనాడు కేంద్రమంత్రిగా వున్న సుజనా చౌదరి రాజధానిపై ఎందుకు శ్రద్ద తీసుకోలేదు?
- కేంద్రమంత్రిగా సుజనా, సిఎంగా చంద్రబాబు నిర్వాకం వల్లే ఈ పరిస్థితి.
- వారి అవినీతి, వ్యక్తిగత పోకడలు... దోపిడీ విధానాల వల్లే... 
- ఎపి రాజధానికి కనీసం చిరునామా కూడా లేకుండా పోయింది. 



- ఇసుక సమస్యలపై 14న దీక్ష చేస్తానని చంద్రబాబు అంటున్నారు. 
- ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
- దేశ వ్యాప్తంగా మంచి కార్యక్రమాలు చేపట్టే రోజునే ఇటువంటి దీక్షలు చేస్తారా?
- చంద్రబాబుకు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడే అర్హత లేదు. 
-  వైఎస్‌ఆర్‌ హయాంలో ఎపిలో పెద్ద ఎత్తున గృహనిర్మాణ కార్యక్రమాలు చేశాం.
- ఉమ్మడి రాష్ట్రంలో సుమారు నలబై లక్షల ఇళ్లు నిర్మించాం.
- ఈ పదమూడు జిల్లాల్లో 25 లక్షల గృహాలు నిర్మించాం. 
- 2003-04 మధ్యలో ఉపాధి లేక వసల పోయిన కూలీలకు పనులు కల్పించాం.  
- వైఎస్‌ఆర్ హయాంలో ప్రతి ఒక్కరికీ పనులు దొరికాయి. 


-సిఎంగా చంద్రబాబు అయిదేళ్ల పాలనలో  పెద్ద ఎత్తున కూలీల వలసలు పెరిగాయి. 
- బలహీనవర్గాల ఇళ్లకు బిల్లులు ఇవ్వవద్దని ఆనాడు చంద్రబాబు జీఓ ఇచ్చాడు. 
- ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. 
- టిట్కో హౌసింగ్ పెట్టి కనీసం ఒక్క ఇల్లు అయినా చంద్రబాబు హయాంలో ఇచ్చారా?
- అంతకు ముందు మంజూరైన వాటిని పూర్తి చేసి... రెండు లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేశారు.
-  ఇదీ భవన నిర్మాణ కార్మికుల పట్ల చంద్రబాబుకు వున్న ప్రేమ. 
- దెయ్యాలు వేదాలు వల్లించినట్లు చంద్రబాబు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. 
- వరదలు వస్తాయని తెలిసి ఇసుకను స్టోరేజీ చేసుకోవాలని కొందరు చెబుతున్నారు. 
- కానీ ఇది ఎవరు చేయాలి...? ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయ్యింది.?
- చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ...
- ఈ ప్రభుత్వం వల్లే ఇసుక సమస్య వచ్చిందని విమర్శిస్తున్నారు..
- మీ అయిదేళ్లలో ఒక్కరికి కూడా పని చూపించలేదు.
- మీ హయాంలో వలసలు జరిగే పరిస్థితి కల్పించారు.
- రాష్ట్ర రాజధానికి అడ్రస్‌ లేకుండా చేశారు.
- అవినీతితో రాష్ట్రంలో దోపిడీ చేసుకున్నారు. 
- వాటిని ఈ ప్రభుత్వం సరిచేస్తుంటే... తప్పుడు ఆరోపణలు చేస్తారా?
- మీ అవకతవక విధానాలు... మీ వైఫల్యాల వల్లే ఈ సమస్యలు.
- వీటిని బూతద్దంలో చూపి... మాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
- రాష్ట్రానికి పదహారు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అబద్దాలు చెబుతారా?
- విశాఖలో జరిగిన ఎంఓయుల్లో కనీసం పేర్లు కూడా లేని కంపెనీలు వచ్చాయి. 
- మా ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా పనిచేస్తోంది. 
- ఈ రాష్ట్రంకు ఏ విధంగాపెట్టుబడులు తీసుకురావాలి... 
- నిరుద్యోగ సమస్యను ఏ రకంగా నిర్మూలించాలో మాకు తెలుసు.



- చంద్రబాబుతో కలిసి ఆయన మిత్రుడు పవన్‌ కూడా బయటకువస్తున్నారు.
- ఆయన నటుడు కావడంతో రాజకీయాల్లోనూ తన నటన ప్రదర్శిస్తున్నారు. 
- రాజకీయాల్లో మాటలు కావు.. పని కావాలి.
- రాజకీయాల్లో 25 సంవత్సరాలు వుంటానంటూ... 
- 25 నెలలకు ఒకసారి బయటకు వస్తున్నారు. 
- వ్యక్తిగత అంశాలను కూడా రాజకీయంగా మాట్లాడుతున్నారు. 
- రాజకీయాల్లో కొన్ని పద్దతులు, మర్యాదలు పాటించాలి.
- నిజంగా పవన్‌ కు ప్రజల్లో అంత శక్తే వుంటే..మీరే గత ఎన్నికల్లో గెలిచేవారు కాదా?



- 2014లో నేను ఓటమి పాలయ్యాను.. దానిని అంగీకరించాను.
- తరువాత వైఎస్‌ఆర్ సిపిలో చేరాను. వైఎస్‌ జగన్‌ నాయకత్వం అవసరమని చెప్పాను.
- ఆనాడు వున్న టిడిపి విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని చెప్పాను.
- చంద్రబాబు వల్ల రాష్ట్రం అన్యాయమైపోతోందని అన్నాను. 
- వ్యవస్థలో మార్పు తేవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరమని చెప్పాను.
- వాస్తవాలను అంగీకరించకుండా.... మేమే గొప్ప అనుకుంటే ఎలా పవన్‌...?
- రాజకీయాల్లో వ్యక్తులు గొప్ప కాదు... ప్రజలకు బాధ్యత వహించాలి.
- ప్రజల పట్ల పవన్‌ కళ్యాణ్‌ కు ఎక్కడా బాధ్యత లేదు.
- ఏదో సాధిద్దామని రాజకీయాల్లోకి వచ్చారు. 
- మూడేళ్ల పాటు టిడిపి, బిజెపి ప్రభుత్వానికి అనుకూలం వుండి తరువాత విభేదించారు. 
- రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలపై ఒక్కసారి అయినా గొంతెత్తి మాట్లాడారా...?
- సమస్యలపై మాట్లాడాలే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదు.
- పవన్‌ గడిచిన అయిదేళ్లలో భవన కార్మికుల గురించి ఒక్కసారైనా మాట్లాడారా...?
ఈ రోజు సమస్య వుంది... దీనిని అంగీకరిస్తున్నాం..
- ప్రకృతి వల్ల ఏర్పడిన ఇబ్బంది ఇది. కొద్దిరోజుల్లో దీనిని అధిగమిస్తాం... 
- మేం పెట్టిన స్కీంను ఈ ప్రభుత్వం తీసేసిందని చంద్రబాబు బాధ.
- ఇసుక దోపిడీకి అవకాశం లేదనే ఆవేదన చంద్రబాబుది.
- ఆయన విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం.. అందుకే ప్రజలు తిరస్కరించారు.
- చంద్రబాబులా మేం కూడా దోపిడీ చేయాలా...?
- ఆలీబాబా నలబై దొంగల్లా మేం కూడా పంచుకుని తినాలా?
- రూ. 2లక్షల కోట్లు విలువైన అమరావతి ఏర్పాటు చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. 
- బంగారు బాతు అంటున్నాడు. కానీ ఇది అడ్రస్‌ లేని బాతు...
- అమరావతి తాత్కాలిక చిరునామా అని చంద్రబాబే చెప్పాడు.
- పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదులుకుని చంద్రబాబు పారిపోయి వచ్చాడు.
- చంద్రబాబుకు దూరదృష్టి లేకపోవడం... అవినీతికి పాల్పడటం..వల్లే ఈ పరిస్థితి వచ్చింది.
- రాజధానిపై నిపుణుల కమిటీ రాజధాని విషయంలో అధ్యయనం చేస్తోంది.


- ఈ రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమంను సిఎం శ్రీ వైఎస్‌ జగన్ సమన్వయం చేస్తున్నారు.  
- చంద్రబాబు తన భాషను అదుపులో పెట్టుకోవాలి.
- చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లు సమస్యలపై స్పందించండి. 
- కానీ వ్యక్తిగత అంశాలపై విమర్శలు చేయడం సమంజసం కాదు. 
- సవాళ్లు విసరడం... తాట తీస్తాననడం... పదిమందిని తీసుకువస్తామని చెప్పడం...సరికాదు.
- చంద్రబాబుకు ఎలాగూ రాజకీయ భవిష్యత్తు లేదు... 
- పవన్‌ 25 ఏళ్లపాటు రాజకీయాల్లో వుంటానని చెప్పారు.
- మరో రెండు ఎలక్షన్‌ లు పవన్ చూడాల్సి వుంది.
- ఇప్పటికైనా ఆయన సంయమనంతో మాట్లాడాలి.  


- ఇసుక కొరతకు సిమెంట్ కంపెనీల ముడుపులే కారణమని ఆరోపిస్తున్నారు. 
- చంద్రబాబు మేధావితనం ఏమిటో అర్ధం కావడం లేదు.
- ఇసుక ఆపితే... సిమెంట్ కంపెనీలు ముడుపులు ఇస్తాయని అర్ధం లేని విమర్శలు చేస్తున్నాడు.
- ఉచితం పేరుతో టిడిపి కార్యకర్తలను, ప్రజాప్రతినిధులకు ఇసుకను దోచిపెట్టారు.
- మీ విధానాలను మేం ఎలా అమలు చేస్తాం చంద్రబాబు?


- సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలంటూ కొత్త నినాదంతో చంద్రబాబు దోపిడీ చేశారు.
- హుద్ హుద్‌ తుఫాన్ సందర్బంగా ఈ మాటలు చంద్రబాబు చెప్పారు.
- మేం ఇసుక సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలని అనుకోవడం లేదు. 
- మీ హయాంలో జరిగిన దోపిడీని సరిదిద్దుతున్నాం. 
- భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నాం. 
- తాత్కాలికంగానే ఈ ఇబ్బందులు వున్నాయి. 


- సిఎస్‌ బదిలీ పాలనా వ్యవహారాల్లో సాధారణ అంశం.
- ఉద్యోగులు, మంత్రులు పరిపాలనలో భాగంగా మారుతూ వుంటారు.
- భవన నిర్మాణ కార్మికులకు రూ.50వేలు పరిహారం అడుగుతున్నారు. 
- ఇది ఇవ్వగలిగే మొత్తమేనా... గతంలో ఎప్పుడైనా ఇలా ఇచ్చారా?
- కార్మికులకు ఉపాధి చూపించేందుకు కొత్త పనులను మంజూరు చేస్తున్నాం. 
- పంచాయతీ రాజ్‌ నుంచి ప్రతి నియోజకవర్గానికి రూ.20 కోట్ల వరకు కేటాయించాం. 
- నిర్మాణ రంగంలోని వారికి దీనివల్ల ఉపాధి లభిస్తుంది. 


- విద్యార్ధులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాల పేరు మార్పు సిఎం దృష్టికి వచ్చింది.
- ఆయన దీనిపై సీరియస్‌ గా స్పందించారు. 
-  అబ్దుల్ కలాం పేరుమీదే ఈ పురస్కారాలు వుండాలని ఆదేశించారు. 
- అలాగే ఇటువంటి పురస్కారాలకు మహాత్మగాంధీ, అంబేద్కర్, పూలే, జగజ్జీవన్ రామ్ వంటి మహనీయుల పేర్ల మీద ఇవ్వాలని కూడా సిఎం ఆదేశించారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
స‌మాజ చైత‌న్య‌మే మ‌న ఆయుధం కావాలి... * ఎస్‌జెఆర్‌వో తొలి రాష్ట్ర స్థాయి స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్కా సాయిబాబు పిలుపు విజ‌య‌వాడ‌: నిత్య జీవితంలో ప్ర‌జ‌లు ఎదు‌ర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంతో పాటు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించ‌డం కోసం సంస్థ స‌భ్యులంద‌రూ శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేయాల‌ని సోష‌ల్ జ‌స్టిస్ రైట్ ఫ‌ర్ ఆర్గ‌నైజేష‌న్ (ఎస్‌జెఆర్‌వో) రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్కా సాయిబాబు పిలుపునిచ్చారు. ఎస్‌జెఆర్‌వో రాష్ట్ర స్థాయి తొలి ఎగ్జిక్యూటీవ్ స‌మావేశాన్ని శ‌నివారం ఉద‌యం విజ‌య‌వాడ గాంధీన‌గ‌ర్‌లోని ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన జ‌‌క్కా సాయిబాబు మాట్లాడుతూ ఆర్థిక‌, సామాజిక, రాజ‌కీయ వ్య‌వ‌స్థల్లో ‌జ‌రుగుతున్న అవినీతి, ఆశ్రిత ప‌క్ష‌పాతం కార‌ణంగా న‌ష్ట‌పోతున్న పౌరుల స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వెలుగులోకి తేవ‌డ‌మే ల‌క్ష్యంగా సామాజిక బాధ్య‌త‌గా భావించి సంస్థ స‌భ్యులు ప‌నిచేయాల‌ని కోరారు. స‌మాజంలో మార్పు రావాల‌ని కోరుకునే ప్ర‌తి వ్య‌క్తిని గుర్తించి వారితో క‌లిసి ప‌నిచేయ‌డం సంస్థ ల‌క్ష్యాల్లో ఒక‌ట‌ని పేర్కొన్నారు. స‌మాజంలో పెరిగిపోతున్న కాలుష్యం, త‌గ్గిపోతున్న నైతిక విలువ‌లు, ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల్లో వ‌స్తున్న మార్పులు వంటి అంశాల‌పై స‌భ్యులు నిరంత‌రం గుర్తుచేసుకుంటూ, ల‌క్ష్యాల‌ను నిర్ధేశించుకుంటూ ముందుకు సాగాల‌ని సూచించారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సామాన్య పౌరుల‌ను క‌లుపుకుని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్ల‌డం ద్వారా వారి ప‌రిష్కారం సులువవు‌తుంద‌న్నారు. 7 ద‌శాబ్ధాల క్రితం దేశ స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా ప‌నిచేసిన స‌మ‌ర‌యోధుల ఆశ‌యాల‌ను స్ఫూర్తిగా తీసుకోవాల‌న్నారు. కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వానికి ముందుగా స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ‌జాతిపిత మ‌హాత్మా‌గాంధీ చిత్ర ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించి అనంత‌రం జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా సంస్థ స‌భ్యుల‌కు గుర్తింపు కార్డులు అంద‌జేసి సంస్థ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా సేవ‌లందిస్తామ‌ని ప్ర‌మాణం చేయించారు. ప‌ర్యావ‌ర‌ణ హితం కోసం గ్రో గ్రీన్‌, గ్రీన్ ఇండియా, గ్రీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి మ‌నిషిలా జీవించాల‌ని కోరారు. స‌మావేశానికి ఎస్‌జెఆర్‌వో మ‌హిళా విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాస‌రి ధాత్రి అధ్య‌క్ష‌త వ‌హించ‌గా కృష్ణా జిల్లా అధ్య‌క్ష‌, ప్రధాన కార్య‌ద‌ర్శులు చెన్నాప్ర‌గ‌ఢ ప్ర‌సాద్‌, కొంకిమ‌ళ్ళ శంక‌ర్‌, మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు కె.భాగ్య‌ల‌క్ష్మీ, వివిధ జిల్లాల నుంచి సంస్థ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.