ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?

అమరావతి
05.11.2019


*సచివాలయంలో మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్‌ మీట్ పాయింట్లు...*


- గత రెండు మూడు రోజులుగా ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నాయి.
- చంద్రబాబు అయిదేళ్లు సిఎంగా పనిచేశారు.
- సినిమాల్లో పాటలు విన్నట్లు.. 'అ' అంటే అమరావతి అని మాటలు చెప్పారు.
- చివరికి ఇండియా మ్యాప్ లో ఎపి రాజధాని ఎక్కడా కనిపించకుండా చేశాడు.
- తిరిగి సిఎం శ్రీ వైఎస్‌ జగన్‌ పైన వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు.
- చంద్రబాబు సిగ్గు, ఎగ్గు వదిలేశాడు. 
- అయిదేళ్లు సిఎంగా చేసి రాష్ట్ర రాజధానికి కనీసం అడ్రస్‌ కూడా లేకుండా చేశాడు. 
- 2 నెలల కిందటే రాష్ట్ర రాజధానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని చెప్పాను...
- ఎపీ రాజధానికి కనీసం చిరునామా లేకపోవడం సిగ్గు చేటని ప్రశ్నించాను. 
- రాష్ట్ర ప్రజలకు సొంత రాజధాని లేకుండా చేశారు. 
- దీనిని ప్రశ్నించినందుకు నాపై చంద్రబాబు, ఆయన సహచరులు విమర్శలు చేశారు. 
- బొత్స ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు.  
-  ఇప్పుడు కేంద్రం ఇచ్చిన మ్యాప్‌ లో ఎపి రాజధాని ఎందుకు లేదో సమాధానం చెప్పాలి.
- చంద్రబాబు తోకలుగా వున్న బిజెపి నేతలు దీనికి వంత పాడుతున్నారు. 
- ఆనాడు కేంద్రమంత్రిగా వున్న సుజనా చౌదరి రాజధానిపై ఎందుకు శ్రద్ద తీసుకోలేదు?
- కేంద్రమంత్రిగా సుజనా, సిఎంగా చంద్రబాబు నిర్వాకం వల్లే ఈ పరిస్థితి.
- వారి అవినీతి, వ్యక్తిగత పోకడలు... దోపిడీ విధానాల వల్లే... 
- ఎపి రాజధానికి కనీసం చిరునామా కూడా లేకుండా పోయింది. 



- ఇసుక సమస్యలపై 14న దీక్ష చేస్తానని చంద్రబాబు అంటున్నారు. 
- ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
- దేశ వ్యాప్తంగా మంచి కార్యక్రమాలు చేపట్టే రోజునే ఇటువంటి దీక్షలు చేస్తారా?
- చంద్రబాబుకు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడే అర్హత లేదు. 
-  వైఎస్‌ఆర్‌ హయాంలో ఎపిలో పెద్ద ఎత్తున గృహనిర్మాణ కార్యక్రమాలు చేశాం.
- ఉమ్మడి రాష్ట్రంలో సుమారు నలబై లక్షల ఇళ్లు నిర్మించాం.
- ఈ పదమూడు జిల్లాల్లో 25 లక్షల గృహాలు నిర్మించాం. 
- 2003-04 మధ్యలో ఉపాధి లేక వసల పోయిన కూలీలకు పనులు కల్పించాం.  
- వైఎస్‌ఆర్ హయాంలో ప్రతి ఒక్కరికీ పనులు దొరికాయి. 


-సిఎంగా చంద్రబాబు అయిదేళ్ల పాలనలో  పెద్ద ఎత్తున కూలీల వలసలు పెరిగాయి. 
- బలహీనవర్గాల ఇళ్లకు బిల్లులు ఇవ్వవద్దని ఆనాడు చంద్రబాబు జీఓ ఇచ్చాడు. 
- ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. 
- టిట్కో హౌసింగ్ పెట్టి కనీసం ఒక్క ఇల్లు అయినా చంద్రబాబు హయాంలో ఇచ్చారా?
- అంతకు ముందు మంజూరైన వాటిని పూర్తి చేసి... రెండు లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేశారు.
-  ఇదీ భవన నిర్మాణ కార్మికుల పట్ల చంద్రబాబుకు వున్న ప్రేమ. 
- దెయ్యాలు వేదాలు వల్లించినట్లు చంద్రబాబు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. 
- వరదలు వస్తాయని తెలిసి ఇసుకను స్టోరేజీ చేసుకోవాలని కొందరు చెబుతున్నారు. 
- కానీ ఇది ఎవరు చేయాలి...? ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయ్యింది.?
- చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ...
- ఈ ప్రభుత్వం వల్లే ఇసుక సమస్య వచ్చిందని విమర్శిస్తున్నారు..
- మీ అయిదేళ్లలో ఒక్కరికి కూడా పని చూపించలేదు.
- మీ హయాంలో వలసలు జరిగే పరిస్థితి కల్పించారు.
- రాష్ట్ర రాజధానికి అడ్రస్‌ లేకుండా చేశారు.
- అవినీతితో రాష్ట్రంలో దోపిడీ చేసుకున్నారు. 
- వాటిని ఈ ప్రభుత్వం సరిచేస్తుంటే... తప్పుడు ఆరోపణలు చేస్తారా?
- మీ అవకతవక విధానాలు... మీ వైఫల్యాల వల్లే ఈ సమస్యలు.
- వీటిని బూతద్దంలో చూపి... మాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
- రాష్ట్రానికి పదహారు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అబద్దాలు చెబుతారా?
- విశాఖలో జరిగిన ఎంఓయుల్లో కనీసం పేర్లు కూడా లేని కంపెనీలు వచ్చాయి. 
- మా ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా పనిచేస్తోంది. 
- ఈ రాష్ట్రంకు ఏ విధంగాపెట్టుబడులు తీసుకురావాలి... 
- నిరుద్యోగ సమస్యను ఏ రకంగా నిర్మూలించాలో మాకు తెలుసు.



- చంద్రబాబుతో కలిసి ఆయన మిత్రుడు పవన్‌ కూడా బయటకువస్తున్నారు.
- ఆయన నటుడు కావడంతో రాజకీయాల్లోనూ తన నటన ప్రదర్శిస్తున్నారు. 
- రాజకీయాల్లో మాటలు కావు.. పని కావాలి.
- రాజకీయాల్లో 25 సంవత్సరాలు వుంటానంటూ... 
- 25 నెలలకు ఒకసారి బయటకు వస్తున్నారు. 
- వ్యక్తిగత అంశాలను కూడా రాజకీయంగా మాట్లాడుతున్నారు. 
- రాజకీయాల్లో కొన్ని పద్దతులు, మర్యాదలు పాటించాలి.
- నిజంగా పవన్‌ కు ప్రజల్లో అంత శక్తే వుంటే..మీరే గత ఎన్నికల్లో గెలిచేవారు కాదా?



- 2014లో నేను ఓటమి పాలయ్యాను.. దానిని అంగీకరించాను.
- తరువాత వైఎస్‌ఆర్ సిపిలో చేరాను. వైఎస్‌ జగన్‌ నాయకత్వం అవసరమని చెప్పాను.
- ఆనాడు వున్న టిడిపి విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని చెప్పాను.
- చంద్రబాబు వల్ల రాష్ట్రం అన్యాయమైపోతోందని అన్నాను. 
- వ్యవస్థలో మార్పు తేవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరమని చెప్పాను.
- వాస్తవాలను అంగీకరించకుండా.... మేమే గొప్ప అనుకుంటే ఎలా పవన్‌...?
- రాజకీయాల్లో వ్యక్తులు గొప్ప కాదు... ప్రజలకు బాధ్యత వహించాలి.
- ప్రజల పట్ల పవన్‌ కళ్యాణ్‌ కు ఎక్కడా బాధ్యత లేదు.
- ఏదో సాధిద్దామని రాజకీయాల్లోకి వచ్చారు. 
- మూడేళ్ల పాటు టిడిపి, బిజెపి ప్రభుత్వానికి అనుకూలం వుండి తరువాత విభేదించారు. 
- రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలపై ఒక్కసారి అయినా గొంతెత్తి మాట్లాడారా...?
- సమస్యలపై మాట్లాడాలే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదు.
- పవన్‌ గడిచిన అయిదేళ్లలో భవన కార్మికుల గురించి ఒక్కసారైనా మాట్లాడారా...?
ఈ రోజు సమస్య వుంది... దీనిని అంగీకరిస్తున్నాం..
- ప్రకృతి వల్ల ఏర్పడిన ఇబ్బంది ఇది. కొద్దిరోజుల్లో దీనిని అధిగమిస్తాం... 
- మేం పెట్టిన స్కీంను ఈ ప్రభుత్వం తీసేసిందని చంద్రబాబు బాధ.
- ఇసుక దోపిడీకి అవకాశం లేదనే ఆవేదన చంద్రబాబుది.
- ఆయన విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం.. అందుకే ప్రజలు తిరస్కరించారు.
- చంద్రబాబులా మేం కూడా దోపిడీ చేయాలా...?
- ఆలీబాబా నలబై దొంగల్లా మేం కూడా పంచుకుని తినాలా?
- రూ. 2లక్షల కోట్లు విలువైన అమరావతి ఏర్పాటు చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. 
- బంగారు బాతు అంటున్నాడు. కానీ ఇది అడ్రస్‌ లేని బాతు...
- అమరావతి తాత్కాలిక చిరునామా అని చంద్రబాబే చెప్పాడు.
- పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదులుకుని చంద్రబాబు పారిపోయి వచ్చాడు.
- చంద్రబాబుకు దూరదృష్టి లేకపోవడం... అవినీతికి పాల్పడటం..వల్లే ఈ పరిస్థితి వచ్చింది.
- రాజధానిపై నిపుణుల కమిటీ రాజధాని విషయంలో అధ్యయనం చేస్తోంది.


- ఈ రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమంను సిఎం శ్రీ వైఎస్‌ జగన్ సమన్వయం చేస్తున్నారు.  
- చంద్రబాబు తన భాషను అదుపులో పెట్టుకోవాలి.
- చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లు సమస్యలపై స్పందించండి. 
- కానీ వ్యక్తిగత అంశాలపై విమర్శలు చేయడం సమంజసం కాదు. 
- సవాళ్లు విసరడం... తాట తీస్తాననడం... పదిమందిని తీసుకువస్తామని చెప్పడం...సరికాదు.
- చంద్రబాబుకు ఎలాగూ రాజకీయ భవిష్యత్తు లేదు... 
- పవన్‌ 25 ఏళ్లపాటు రాజకీయాల్లో వుంటానని చెప్పారు.
- మరో రెండు ఎలక్షన్‌ లు పవన్ చూడాల్సి వుంది.
- ఇప్పటికైనా ఆయన సంయమనంతో మాట్లాడాలి.  


- ఇసుక కొరతకు సిమెంట్ కంపెనీల ముడుపులే కారణమని ఆరోపిస్తున్నారు. 
- చంద్రబాబు మేధావితనం ఏమిటో అర్ధం కావడం లేదు.
- ఇసుక ఆపితే... సిమెంట్ కంపెనీలు ముడుపులు ఇస్తాయని అర్ధం లేని విమర్శలు చేస్తున్నాడు.
- ఉచితం పేరుతో టిడిపి కార్యకర్తలను, ప్రజాప్రతినిధులకు ఇసుకను దోచిపెట్టారు.
- మీ విధానాలను మేం ఎలా అమలు చేస్తాం చంద్రబాబు?


- సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలంటూ కొత్త నినాదంతో చంద్రబాబు దోపిడీ చేశారు.
- హుద్ హుద్‌ తుఫాన్ సందర్బంగా ఈ మాటలు చంద్రబాబు చెప్పారు.
- మేం ఇసుక సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలని అనుకోవడం లేదు. 
- మీ హయాంలో జరిగిన దోపిడీని సరిదిద్దుతున్నాం. 
- భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నాం. 
- తాత్కాలికంగానే ఈ ఇబ్బందులు వున్నాయి. 


- సిఎస్‌ బదిలీ పాలనా వ్యవహారాల్లో సాధారణ అంశం.
- ఉద్యోగులు, మంత్రులు పరిపాలనలో భాగంగా మారుతూ వుంటారు.
- భవన నిర్మాణ కార్మికులకు రూ.50వేలు పరిహారం అడుగుతున్నారు. 
- ఇది ఇవ్వగలిగే మొత్తమేనా... గతంలో ఎప్పుడైనా ఇలా ఇచ్చారా?
- కార్మికులకు ఉపాధి చూపించేందుకు కొత్త పనులను మంజూరు చేస్తున్నాం. 
- పంచాయతీ రాజ్‌ నుంచి ప్రతి నియోజకవర్గానికి రూ.20 కోట్ల వరకు కేటాయించాం. 
- నిర్మాణ రంగంలోని వారికి దీనివల్ల ఉపాధి లభిస్తుంది. 


- విద్యార్ధులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాల పేరు మార్పు సిఎం దృష్టికి వచ్చింది.
- ఆయన దీనిపై సీరియస్‌ గా స్పందించారు. 
-  అబ్దుల్ కలాం పేరుమీదే ఈ పురస్కారాలు వుండాలని ఆదేశించారు. 
- అలాగే ఇటువంటి పురస్కారాలకు మహాత్మగాంధీ, అంబేద్కర్, పూలే, జగజ్జీవన్ రామ్ వంటి మహనీయుల పేర్ల మీద ఇవ్వాలని కూడా సిఎం ఆదేశించారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image