గవర్నర్ జోక్యం చేసుకోవాలి

గవర్నర్ జోక్యం చేసుకోవాలి          
*ఏపీయుడబ్ల్యూ జే వినతి * గవర్నర్ ను కలసి వినతిపత్రం అందజేసిన నేతలు
 మీడియా స్వేచ్ఛ కి భంగం కలిగించే జీఓ నెంబర్ 2430 ని రద్దు చేయాలన్న డిమాండు విషయంలో రాజ్యంగా పరిరక్షణకులు అయిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఏపీయుడబ్ల్యూజే) కోరింది. ఆమేరకు గురువారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో గవర్నర్ ని యూనియన్ నేతలు కలసి వినతిపత్రం అందజేశారు. ఐజెయు ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్ కుమార్, ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, చిన్నమధ్యతరహా పత్రిక సంగం అధ్యక్షుడు నల్లి ధర్మారావు, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, తదితరులు గవర్నర్ ని కలిశారు. తొలుత గవర్నర్ కి జీఓ వలన మీడియా స్వేచ్ఛ కి ఏవిధమైన ముప్పు ఉందొ యూనియన్ నేతలు వివరించారు. ఈ జీఓ విషయం తన దృష్టికి వచ్చిందని పిసిఐ చైర్మన్  కూడా   స్పందించటాన్ని కూడా ఈ రోజు పత్రికలలో చూసాను అని గవర్నర్ యూనియన్ నేతలతో అన్నారు. గతంలో2007 అప్పటిముఖ్యమంత్రి వై ఎస్ రాజాశేఖర్ రెడ్డి జీఓ 938 ని తీసుకొని వచ్చరని, దానిని అప్పుడు కూడా వ్యతిరేక కించడం తో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీఓ ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారని, జీఓ ను రద్దు చేయకపోయినా వినియోగించలేదని యూనియన్ నేతలు గవర్నర్ దృష్టి కి తెచ్చారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీఓ 2430 చాలా  ప్రమాదకరంగా ఉందని,  తక్షణమే ప్రభుత్వం జీఓ ని ఉపసంహరించుకొనే విధంగా చూడాలని యూనియన్ నేతలు గవర్నర్ ను కోరారు. దేశంలోని జర్నలిస్టుల సంఘాలు, సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రజాస్వామ్యక వాదులు, వివిధ రాజకీయ పార్టీలు ఈ జీఓ ను  వ్యతిరేకేస్తున్నారని గవర్నర్ కి తెలిపారు. ఆమేరకు వివరాలు తో కుడి న వినతిపత్రం ని గవర్నర్ కి యూనియన్ నేతలు అందజేసారు. తప్పకుండా పరిశీలిస్తాన్ని గవర్నర్ హామీ ఇచ్చారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image