జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్టు గంట్ల శ్రీనుబాబు సొంత నిధులతో నిత్యావసర సరుకుల పంపిణీ

విశాఖపట్నం న్యూస్


 విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్టు గంట్ల శ్రీనుబాబు సొంత నిధులతో నిత్యావసర సరుకుల పంపిణీ


 


కరోనా వైరస్ సమయంలో  విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు తమ వంతు సాయం అందించాలన దృఢ  సంకల్పముతో సొంత నిధులతో 10 కేజీల బ్రాండెడ్ బియ్యం ఓక లీటరు ఆయిల్ ప్యా కెట్ , కేజీ పంచదార,  చింత పండులను  దశలవారీగా అందించడం  జరుగుతుందని సీనియర్ జర్నలిస్టు  గంట్ల శ్రీనుబాబు తెలిపారు


శనివారం ఉదయం సీతమ్మదార ఆంధ్రప్రభ కార్యాలయంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని  చేపట్టారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ  ఇప్పటికే 70 మంది జర్నలిస్టులకు ఇవ్వడం జరిగిందన్నారు . మరో 132 మంది జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ఐదు రోజుల పాటు  కొనసాగుతోందని తెలిపారు వెబ్ న్యూస్ ఛానల్ లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు కూడా అందించడం జరుగుతుందన్నారు.  అయితే కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల ఆదుకోవాలని కోరారు తమిళనాడు తరహాలో గుర్తింపు పొందిన జర్నలిస్టులకు నగదు పంపిణీ చేపట్టాలని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల భీమా లో జర్నలిస్టులకు చేర్చాలని కోరారు 
నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ వంతు సాయంగా జర్నలిస్టులకు సహాయం   చేయాలని ప్రజా  ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్ లో తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలని  ఈ సందర్భంగా  గంట్ల  శ్రీను  బాబు జర్నలిస్టులకు సూచించారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు