రెండవ రోజు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 


విజయవాడ :
శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారం లో భక్తులకు శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి అమ్మవారు సోమవారం  దర్శనమిచ్చారు.


రెండవ రోజు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 


బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మ ను అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. 


 మనస్సు , బుద్ధి చిత్తం అమ్మవారి ఆధీనంలో ఉంటాయని భక్తుల విశ్వాసం.


ఉదయం నుంచే భక్తులు పిల్లలతో కలసి వొచ్చి దర్శనం చేసుకున్నారు.  


రెండు నుంచి 10 ఏళ్ళు లోపు బాలికలను అమ్మవారి ప్రతి రూపంగా భావించి పూజలు చెయ్యడం ఈ రోజు ప్రాముఖ్యత. 


దేవస్థానం ఆధ్వర్యంలో బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి బాలార్చన ను ను ఘనంగా నిర్వహించడం జరిగింది.  


ఈ బాలికలను అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి అమ్మవారికి పాయసం, గారెలు నైవేద్యంగా నివేదిస్తారు.