ఏడాదిలోగా ఏపీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం : మంత్రి మేకపాటి

న్యూ ఢిల్లీ :
*మౌలిక వసతుల కల్పన రంగంలో ఏడాదిలోగా ఏపీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
• గత ప్రభుత్వం మంగళగిరిలో ఐటీని ప్రోత్సహించాలని ప్రయత్నించి విఫలమైంది
• విశాఖపట్నం కేంద్రంగా ఐటీ అభివృద్ధికి కృషి చేస్తాం
• సులభతర మౌలిక వసతుల కల్సన రంగంలో రాష్ట్రాల ర్యాంకులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
• మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్
• కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా  అవార్డు అందుకున్న ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
• ప్రతి 3 నెలలకోసారి అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించాలని కోరిన మంత్రి
• ఆక్వా రంగానికి సంబంధించిన సర్టిఫికేషన్ ల్యాబ్ లను  విశాఖపట్నం లేదా కాకినాడలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి


అమరావతి ,సెప్టెంబర్, 12 ;    మౌలిక వసతుల కల్పన రంగంలో ఏడాదిలోగా రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం  విదేశీ వాణిజ్యంపై 'బోర్డ్ ఆఫ్ ట్రేడ్' పేరుతో సమావేశం నిర్వహించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్,  అన్ని రాష్ట్రాల పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రులు, ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన  ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరపున మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వం అనువుకాని ప్రాంతమైన మంగళగిరిలో ఐటీని ప్రోత్సహించాలని ప్రయత్నించి విఫలమైందని మంత్రి ఆరోపించారు. తద్వారా రాష్ట్రానికి రావాల్సిన ఐటీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయన్నారు. గత ప్రభుత్వం విధానాలను ప్రక్షాళన చేసి విశాఖపట్నం కేంద్రంగా ఐటీ అభివృద్ధికి కృషి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి మేకపాటి.  రాష్ట్రంలోని కీలకమైన ఐదు రంగాల్లో కేంద్రం ప్రభుత్వం నుంచి సహకారం కోరుతున్నామని మంత్రి మేకపాటి వ్యాఖ్యానించారు. 


పరిశ్రమలలో జీఎస్టీ  పన్నుల విషయంలో రాష్ట్రాలు రాయితీలు కోరుతున్నాయన్నారు. దీనిపై కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే జరిగితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎలక్ట్రానిక్స్, సెల్‌ఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లలో 4 నుంచి 5 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. పత్తి సేకరణకే ఉత్పత్తి కన్నా ఎక్కువ ఖర్చు అవుతోందని, అందువల్ల ల్ల టెక్స్ట్‌టైల్స్ మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.  అదే విధంగా రాష్ట్రంలో ఆక్వా ఎగుమతుల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని మంత్రి వివరించారు. నాణ్యతా ప్రమాణాల ధృవీకరించేందుకు రాష్ట్రంలో ప్రయోగశాలలు లేవన్నారు. దీని వల్ల ఆక్వా ఉత్పత్తులను అనుకున్నంత స్థాయిలో ఎగుమతి చేయడం సాధ్యపడడం లేదని మంత్రి తెలిపారు.  విశాఖపట్నం లేదా కాకినాడలో సర్టిఫికేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సమావేశంలో  మంత్రి ప్రభుత్వ అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతి 3 నెలలకోసారి అన్ని రాష్ట్రాలతో వర్తకం, ఎగుమతులపై సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా రంగాలలో ఏవైనా ఇబ్బందులుంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు సులభంగా ఉంటుందని మంత్రి తెలిపారు. మెరైన్, సీ పాలసీ రూపొందించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వేటకు వెళ్లలేని పరిస్థితుల్లో మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తోందని, ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకారమందిస్తే బాగుంటుందని మంత్రి అన్నారు.  ఇక చేపల వేట విషయంలో ఎకనామిక్ జోన్ దాటి వెళ్లాలంటే పెద్ద పెద్ద ట్రాలీలు అవసరమని. ఆ సదుపాయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించాలన్నారు.ప్రస్తుతం ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడిన పరిస్థితులలోనూ భారతదేశం అవకాశాలను సృష్టించుకోగలదని మంత్రి అన్నారు.  అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం వల్ల పరిశ్రమలు ఇతర దేశాలకు తరలి వెళ్తున్నాయని , ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులున్నాయన్నారు మంత్రి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో విదేశీ వర్తకంపై అన్ని రాష్ట్రాలతో  కేంద్రం నిర్వహించిన ట్రేడ్ బోర్డ్ మీటింగ్ లో సులభతర లాజిస్టిక్స్ లో రాష్ట్రాల ర్యాంకులను కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా  ఆంధ్రప్రదేశ్  3వ స్థానంలో నిలిచింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా  ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అవార్డును అందుకున్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image