విధానం చాలా దుర్మార్గం :పోతిన మహేష్

భవన నిర్మాణ కార్మికులకు, సామాన్య ప్రజానీకానికి ఈ ప్రభుత్వంలో ఇసుక కష్టాలు తప్పవని మన ముఖ్యమంత్రి  ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రముఖ దినపత్రికలలో పూర్తి పేజీలో వివరించిన విధానం చాలా దుర్మార్గం అని  జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుండి విడుదల చేసిన  పత్రికా ప్రకటన లో ఇసుక పై ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గపు విధానం పై ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వo  ఇసుక మాఫియా కి, దోపిడీ విధానానికి మద్దతు పలికే విధంగా నేడు జగన్ మోహన్ రెడ్డి గారి  చిత్రపటంతో విడుదల చేసిన ప్రభుత్వ ప్రకటన ఉందని,  13 జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో టన్ను  ఇసుక రేటును  ప్రభుత్వం ప్రకటించిన ధరలతో పోల్చితై ఒక ట్రాక్టర్ ధర నాలుగు వేల రూపాయలుకు, ఒక లారీ ధర 18 వేల రూపాయలకు  అందుబాటులో ఉంటుందని ప్రకటించడం వలన ఎవ్వరికి ఇసుకను అందుబాటులో ఉంచకుండా చేయడమే ప్రభుత్వ ధ్యేయం లా ఉందని కార్మికుల ప్రజల కష్టాలు రాబోయే రోజుల్లో మరింత తీవ్రమయై పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి అని CM జగన్మోహన్ రెడ్డి గారికి పాలన చేతకాక తప్పుడు నిర్ణయాలు విధానాలతో వారి వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని   ఎవరన్నా ప్రజలకి మంచి చేసి ప్రకటనలు ఇచ్చికుంటారు కానీ, ఈ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రకటనలు ఇచ్చుకోవడం మూర్ఖత్వం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి నిజంగా ఈ రాష్ట్ర ప్రజల కష్టాల మీద కార్మికుల ఇబ్బందులు మీద రాష్ట్ర అభివృద్ధి  మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే టన్ను ఇసుక రేటు ను వంద రూపాయలకు అందజేయాలని మహేష్ డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో గంజాయి అమ్మకాలు ఎక్కువయ్యాయని గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకి పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముందు గంజాయ్ అమ్మ అమ్మకం చేసే వారి పైన అదేవిధంగా గంజాయి సేవించి ఇబ్బందులు కలిగిస్తున్నా వారి మీద పోలీస్ శాఖ వారు కఠినమైన చర్యలు తీసుకోవాలని,వన్ టౌన్ ప్రాంతవాసులు లో బ్రిడ్జి మీదుగా ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అనునిత్యం అక్కడ  ట్రాఫిక్ స్తంభించి పోవడం, రోడ్లపై పెద్దపెద్ద గోతులు ఉండడం, చిన్నపాటి వర్షానికి నీరు నిలిచి పోవడం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనిపై  పోలీస్ శాఖ వారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే సత్వర చర్యలు చేపట్టాలని మహేష్ కోరారు.


 


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image