పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరిన ఐదుగురు ఎంపీ లు 

ఎంవీవీసత్యనారాయణ పార్టీ ఆఫీస్ (విశాఖ ఎంపీ)
గళం విప్పుతాం .......
పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరిన ఐదుగురు ఎంపీ లు
విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి వీడ్కోలు పలికిన పార్టీ శ్రేణులు 
పలు విషయాలపై పార్లమెంట్ లో గళమెత్తనున్నట్టు ఎంపీల స్పష్టం
విశాఖపట్నం , నవంబర్ 18 
ప్రత్యేక హోదా సాధన ,పోలవరం నిధుల కేటాయింపు ,ఆయా పార్లమెంట్ పరిధులలో అభివృద్ధికి కేంద్రం నుంచి రాబట్టేలా గళం విప్పుతామని వై ఎస్ ఆర్ సిపి  ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ ,గొడ్డేటి మాధవి ,బెల్లాన చంద్ర శేఖర్ ,వంగా గీత ,సంజీవ్ కుమార్ లు అన్నారు. న్యూ ఢిల్లీ లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు సోమవారం వారు ఢిల్లీ పయనమయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అధినేత ,ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సూచనల మేరకు పార్లమెంట్  సమావేశాల్లో రాష్ట్రసమస్యలను గట్టిగా ప్రస్తావిస్తామన్నారు. ఈ క్రమంలో నగర పార్టీ శ్రేణులు ఎంపీలకు ఘన వీడ్కోలు పలికారు.