ఇసుక సరఫరా పెంపుపై సీఎం వైయస్‌.జగన్‌ కీలక సమావేశం

06–11–2019
అమరావతి
అమరావతి: ఇసుక సరఫరా పెంపుపై సీఎం వైయస్‌.జగన్‌ కీలక సమావేశం
సమావేశంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్‌ పోలీసు అధికారులు రవిశంకర్‌ అయ్యన్నార్, సురేంద్రబాబు, గనులశాఖ అధికారులు
సమావేశంలో కీలక ఆదేశాలు జారీచేసిన సీఎం


*ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌ నివారణకు కఠిన చర్యలు ప్రకటించిన సీఎం*
ఇసుక ధరలకు కళ్లెం వేయాలని సీఎం వైయస్‌.జగన్‌ నిర్ణయం
ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం
ఈలోగా ఆర్డినెన్స్‌ సిద్ధంచేయాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు
జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరను నిర్ణయించాలని కలెక్టర్లకు, గనులశాఖ అధికారులకు సీఎం ఆదేశాలు
ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకు రండి:
ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఎంత రేటు పెట్టాలో కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయించాలని అధికారులకు ఆదేశాలు
రేటు నిర్ణయించాక ధరలను ప్రకటించాలి:
నిర్ణయించిన ధరలు ప్రజలకు అర్థమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలి:
నిర్ణయించిన రేటుకే ఇసుకను అమ్మాలి:
ఈలోగా ఇసుక సరఫరాను బాగా పెంచాలి:


అలాగే ఒక టోల్‌ ఫ్రీ నంబర్‌ను పెట్టాలి:
ఇసుకను అధిక రేటుకు అమ్ముతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి, జైలుకు పంపాలి:
ఒక్క రవ్వకూడా అవినీతికి తావులేకుండా చేస్తున్నాం, అయినా సరే మనం విమర్శలకు గురవుతున్నాం:
ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి దూరంగా ఉన్నారు, అయినా సరే బండలు వేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు:
వచ్చే వారం స్పందన నాటికి ఈ రేట్లు, టోల్‌ ఫ్రీ నంబర్‌ ప్రకటించాలి:
వచ్చేవారం స్పందన కేవలం ఇసుక సమస్యపైనే నిర్వహిస్తాం:
స్పందనలో ఇసుక వారోత్సవం తేదీల ప్రకటిస్తాం:


సరిహద్దుల్లో నిఘాను పెంచండి: సీఎం
ఎట్టిపరిస్థితుల్లోనూ స్మగ్లింగ్‌ చేయకూడదు:
టెక్నాలజీని వాడుకోండి:
స్మగ్లింగ్‌ జరిగితే చెడ్డపేరు వస్తుంది:
చెక్‌పోస్టుల్లో టీంలను పెంచుతామన్న అధికారులు
మొబైల్‌ టీంలను పెంచుతామన్న అ«ధికారులు
ప్రత్యేక టీంలను కూడా పెంచుతామన్న అధికారులు
చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది ఉండేందుకు వీలుగా కనీస సదుపాయాలు ఇవ్వాలని సీఎం ఆదేశం
రెయిడ్స్‌ చేయాలి, కేసులు పెట్టాలి, తప్పు చేసిన వారిని విడిచిపెట్టకుండా జైలుకు పంపాలి: సీఎం
ఇది జరిగితే.. కచ్చితంగా పరిస్థితి అదుపులోకి వస్తుంది: సీఎం
ప్రతిరూట్లోనూ చెక్‌ పోస్టు పెట్టాలి: సీఎం


ప్రస్తుతం ఇసుక లభ్యతపై అధికారుల నుంచి వివరాలు కోరిన సీఎం
275 రీచ్‌ల్లో 83 చోట్ల రీచ్‌లు పనిచేస్తున్నాయన్న అధికారులు
పనిచేస్తున్న ఇసుక రీచ్‌ల సంఖ్య 61 రీచ్‌లనుంచి 83 రీచ్‌లకు పెరిగిందన్న అధికారులు 
రోజుకు సరఫరా 41వేల మెట్రిక్‌ టన్నుల నుంచి 69 వేల మెట్రిక్‌ టన్నులు సరఫరా పెరిగిందన్న అధికారులు
వారంరోజుల్లో లక్ష మెట్రిక్‌ టన్నులకు సరఫరా పెరుగుతుందన్న అధికారులు
వాతావరణం ఇలాగే సహకరిస్తే... 15–30 రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందన్న అధికారులు
వాతావరణం సహకరించిన వెంటనే 275 రీచ్‌ల్లో ఇసుక వెలికితీత ప్రారంభిస్తామన్న అధికారులు
రోజుకు 2–3 లక్షల టన్నుల వరకూ ఇసుకను సరఫరా చేయగలుగుతామన్న అధికారులు


275 రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? లేదా?: అధికారులను ప్రశ్నించిన సీఎం
275 రీచ్‌ల్లో ఏం జరుగుతుందనే దానిపై మనం చూడగలగాలి: సీఎం
ఇసుక తవ్వకాలు నిలిచిపోతే ఎందుకు నిలిచిపోయాయో మనం తెలుసుకునే అవకాశం కలగాలి:
మొత్తం 275 చోట్ల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, మనం లైవ్‌లో చూడగలగాలి
మైనింగ్‌ అధికారులు, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కంట్రోల్‌ రూంద్వారా చూడగలగాలి:సీఎం
రాత్రి పూట కూడా పనిచేయగలిగే సీసీ కెమెరాలు పెట్టాలి:


 


వరద నీరు తగ్గగానే అన్ని రీచ్‌లనుంచి ఇసుక సరఫరా ప్రారంభం కావాలి:సీఎం
ప్రతి రీచ్‌ వద్ద సీసీ కెమెరాలు పెట్టాలి:
ఇసుక సరఫరా కోసం వాహనాలు పుష్కలంగా అందుబాటులో ఉండాలి:
కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున ఇసుక రవాణాకు ఎవరు ముందుకు వచ్చినా వారికి వెంటనే అనుమతి ఇవ్వాలి:
ఇసుక నిల్వలు సరిపడా ఉన్నంతవరకూ విరామం లేకుండా పనిచేయాలి:
అవసరమైతే ఇంకా స్టాక్‌ పాయింట్లు పెంచాలి:
ఇసుక విషయంలో ఎవ్వరూ వేలెత్తిచూపకుండా ఇసుక సరఫరా కావాలి:
అలాగే రీచ్‌ల వద్ద ఈ నెలాఖరు నాటికి కెమెరాలు, వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి: 
ఆలస్యంకాకుండా వేర్వేరు సంస్థలనుంచి సాంకేతిక సహకారం తీసుకోండి:


వరదలన్నవి మన చేతిలో లేవు:
ఆగస్టునుంచి ఇవ్వాళ్టి వరకూ నదుల్లో అలానే వరద కొనసాగుతోంది:
అధికారంలోకి వచ్చి 5నెలలు అయింది: 
మంత్రులు జూన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు, పాలనకు సన్నద్ధమయ్యేలోగా ఆగస్టులో వరదలు ప్రారంభం అయ్యాయి:
5నెలల్లో 3 నెలలు వరదలు వచ్చాయి:
ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయి:
ఏ ఇష్యూ లేక ప్రతిపక్షాలు ఇసుక అంశాన్ని పట్టుకున్నాయి:
మంచి మనసుతో పనిచేస్తున్నప్పుడు కచ్చితంగా దేవుడు సహకరిస్తాడు:


*మద్యం నియంత్రణపైనా సీఎం సమీక్ష*
గ్రామాల్లో ఎవ్వరైనా లిక్కర్‌ అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి:సీఎం
లిక్కర్‌ అమ్మినట్టు ఫిర్యాదు రాగానే కచ్చితంగా జైలుకు పంపాలి:
దీనిపై కూడా టోల్‌ ఫ్రీ నంబర్‌ కూడా ఏర్పాటు చేయాలి
దీనిపై కూడా చట్టం తీసుకురావాలి: 
దీనిపై విధివిధానాలకు మరో సమావేశం ఏర్పాటు చేయాలన్న సీఎం


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image