పాఠశాల విద్యాశాఖపై సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష

*అమరావతి*


*పాఠశాల విద్యాశాఖపై సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష*


*సమీక్షకు హజరైన విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు*


*జగనన్న విద్యా కానుక*


స్టూడెంట్‌ కిట్స్‌
యూనిఫామ్‌ క్లాత్‌ (3 జతలు కుట్టించుకునేందుకు వీలుగా), నోట్‌బుక్స్, షూస్‌ అండ్‌ సాక్స్, బెల్ట్, బ్యాగ్‌కు అదనంగా టెక్ట్స్‌బుక్స్‌ కూడా కలపాలని సీఎం ఆదేశం
కొత్త పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ పరిశీలించిన సీఎం
కాంపిటీటివ్‌ టెండర్లు పిలిస్తే ధరలు తగ్గే అవకాశం ఉందన్న సీఎం
ఈ ప్రొక్యూర్‌మెంట్, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామన్న అధికారులు
క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వద్దు
నాణ్యమైన కిట్స్‌ విద్యార్ధులకు అందాలి
ఎక్కడా జాప్యం జరగకూడదు, అన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలి


*మనబడి నాడు – నేడు*


పాఠశాలల్లో నాడు నేడు పనులు ఎలా జరుగుతున్నాయని అధికారులను ప్రశ్నించిన సీఎం
ప్రతీ చోటా పనులు ప్రారంభమయ్యాయా అని అధికారులను అడిగిన సీఎం
ఎన్ని స్కూల్స్‌లో పనులు ప్రారంభించారని వివరాలు అడిగిన సీఎం
ఇంకా ఎన్ని పాఠశాలల్లో ఇంకా పనులు మొదలు కాలేదని అడిగిన సీఎం, జాప్యం చేయకుండా వెంటనే పనులు ప్రారంభించాలి
అవసరమైతే సీఎంవో అధికారుల సహకారం తీసుకుని పనులు జాప్యం జరగకుండా ముందుకెళ్లండని అధికారులకు సూచన
విద్యార్ధులకు స్కూల్‌ బిల్డింగ్‌ చూడగానే స్కూల్స్‌కి వెళ్ళాలనే విధంగా లైవ్లీగా ఉండాలి
కాంపౌండ్‌ వాల్‌ నుంచి స్కూల్‌ బిల్డింగ్‌ వరకూ వాడే మెటీరియల్ మరింత ఆకర్షణీయంగా ఉండాలి, విద్యార్ధులను ఆకట్టుకునేలా గోడలపై  డ్రాయింగ్స్‌ ఉండాలి


*జగనన్న గోరుముద్ద*


గోరుముద్ద పధకం ప్రవేశపెట్టిన తర్వాత స్కూల్స్‌లో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపిన అధికారులు
విద్యార్ధులకు చిక్కీ కూడా అందుతుందా అని అధికారులను అడిగిన సీఎం, ఇస్తున్నామని చెప్పిన అధికారులు
మానిటరింగ్‌ ఎలా జరుగుతుందని అధికారులను ప్రశ్నించిన సీఎం
గోరుముద్దపై మొబైల్‌ యాప్‌ సిద్దమవుతుందని సీఎంకి వివరించిన అధికారులు, వెంటనే యాప్‌ సిద్దం చేయాలని ఆదేశం
యాప్‌లో మెనూ వివరాలు ఉండాలి, ఏ రోజు ఏ మెనూ ఇస్తున్నామో యాప్‌లో ఉండాలి
ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే యాప్‌లో తెలియాలి, ఆ తర్వాత వెంటనే సంబంధిత ఉన్నతాధికారి సమస్య పరిష్కరించాలి, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి
మానిటరింగ్‌ అనేది ఎప్పటికప్పుడు ఉండాలి
ఏ స్కూల్‌లో మెనూ తేడా వచ్చినట్లు ఫిర్యాదు అందగానే వెంటనే పరిష్కరించాలి
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ కాబట్టి ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం, అజాగ్రత్త వద్దు, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి
మార్పు అనేది విద్య నుంచే ప్రారంభం కావాలి
స్కూల్స్‌లో శానిటేషన్‌ విషయంలో కూడా పక్కాగా ఉండాలి
టీచర్స్‌ ట్రైనింగ్, కరిక్యులమ్‌ వివరాలు అధికారులను ఆరా తీసిన సీఎం
టీచర్స్‌ ట్రైనింగ్, కరిక్యులమ్, వర్క్‌బుక్స్, టెక్ట్స్‌బుక్స్‌ విషయంలో అధికారుల పనితీరును అభినందించిన సీఎం
మోరల్స్, ఎధిక్స్‌ అనే క్లాస్‌లు కూడా ఉండాలి, విద్యార్ధులకు ఇవి చాలా ముఖ్యం
డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల వివరాలు అడిగిన సీఎం
మానసిక వికలాంగుల కోసం పులివెందులలో వైఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ప్రత్యేకంగా నడుపుతున్న విజేత స్కూల్‌ సక్సెస్‌ స్టోరీ అంశాన్ని ప్రస్తావించిన అధికారులు
మానసిక వికలాంగుల కోసం పులివెందుల విజేత స్కూల్‌ తరహాలో నియోజకవర్గానికి ఒక స్కూల్‌ ఉండాలి
నాడు నేడు పనుల్లో భాగంగా ఈ స్కూల్స్‌ కూడా ఏర్పాటుచేయండి


నాడు నేడు విషయంలో అధికారులు మరింత చొరవ తీసుకుని పనిచేయాలని అదేశం, వచ్చే సమీక్షా సమావేశానికల్లా నాడు నేడు పనుల్లో పురోగతి కన్పించేలా అధికారుల చర్యలుండాలన్న సీఎం


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image