ప్రజలు  అర్థం చేసుకోండి

మదనపల్లి, మార్చి 24 : ప్రజలు  అర్థం చేసుకోండి కరోనా ఏ స్థాయిలో ఉంటే ప్రభుత్వం ఇంతటి నిర్ణయం తీసుకుంటుందని సబ్ కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం  మదనపల్లి పట్టణం నందు మంగళవారం జరిగే వారపు  సంత ను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంతలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండడం చూసి ప్రజలు ప్రభుత్వం కరోనా వైరస్ పై తీసుకుంటున్న దానికి ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని తెలిపారు.  కరోనా ఏ స్థాయిలో ఉంటే ప్రభుత్వం ఇంతటి నిర్ణయం తీసుకుంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని, మన కోసం మన భవిష్యత్తు కోసం, మన ప్రాణాల కోసం ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి నిర్ణయానికి  మనం గౌరవించి ప్రతి ఒక్కరూ ఇండ్లల్లో ఉండాలని తెలిపారు. ఇంటిలో ఓక్కరు మాత్రమే బయటకు వచ్చి కావలసిన  నిత్యావసర వస్తువుల కొనుగోలు చేసుకొని వెళ్లాలని  తెలిపారు. ప్రజలు గుంపులుగా ఉండకూడని గుంపులుగా ఉంటే కరోనా వైరస్ ఇతరులకు సోకుతుందని తెలిపారు.  ప్రభుత్వ  సూచనలను తేలికగా తీసుకోవద్దని నిబంధనలు పాటించాలని, అందరూ ఇళ్లకే  పరిమితం కావాలన్నారు. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వ అందజేసిన కరపత్రాలు ఫ్లెక్సీ ల ద్వారా కరోనా వైరస్ వ్యాధి నుండి ఎలా విముక్తి చెందడం బ్యానర్లు పట్టణం లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు.  ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని మాస్కులు లేకుండా ఇంటి నుండి బయటకు రావద్దని తెలిపారు. ప్రజలు గుంపులు గా ఉండడం, గుంపులు గా వెళ్లడం నిషేధించడం జరిగిందని తెలిపారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకొని సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.రవి, తహశీల్దార్ సురేష్ బాబు, పట్టణ సి ఐ తమీం అహమద్ , మున్సిపల్ శాఖ, రెవిన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.