అమరావతి: ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉద్యోగ సంఘాల ఒక రోజు జీతం విరాళం

అమరావతి: ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉద్యోగ సంఘాల ఒక రోజు జీతం విరాళం
కోవిడ్‌–19 నివారణా చర్యలకు ఉద్యోగ సంఘాల విరాళం
క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి లేఖలు సమర్పించిన ఉద్యోగ సంఘాల నేతలు
సీఎంను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి రమేష్, ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి,  ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ వై.వి.రావు, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ సోమేశ్వర్రావు
ఈ సంఘాల నుంచి ఒక రోజు విరాళం రూపంలో దాదాపు రూ. 100 కోట్లు  ఉంటుంది: వెంకట్రామిరెడ్డి
కోవిడ్‌ –19 నివారణకోసం సీఎం తీసుకుంటున్న చర్యలు పటిష్టంగా ఉన్నాయి: వెంకట్రామిరెడ్డి
ముందు చూపుతో సీఎం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా విపత్తును ఎదుర్కోవడంలో ముందుంటున్నాయి: వెంకట్రామిరెడ్డి
క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలు బాగున్నాయి: వెంకట్రామిరెడ్డి
ఈ పరిస్థితుల్లో అండగా ఉండేందుకు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చాం: వెంకట్రామిరెడ్డి