ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తే లాఠీ ఛార్జి చేస్తాం-సిఐ శ్రీధర్,
ఎమ్మిగనూరు,మార్చి, 24 (అంతిమతీర్పు):-
ఎమ్మిగనూరు పట్టణంలో కరోన వైరస్ వ్యాప్తి చెందకుండ ప్రజలు ఇంటికే పరిమితము కావాలని సూచించారు.పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు అనవసరంగా రోడ్ల పైకి వస్తే లాఠీ ఛార్జి చేసి కేసులు నమోదు చేస్తామని పట్టణ సిఐ శ్రీధర్ తెలిపారు.పట్టణంలోని కర్ఫ్యూ విధించినా కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారని కర్ఫ్యూ విధించిన స్వేచ్ఛ గా అలా తిరగడంతో 144 సెక్షన్ అమలులో ఉన్నందువల్ల మేము లాఠీఛార్జ్ చేయకతప్పదని వెల్లడించారు. భద్రంగా ఇళ్లలో ఉంటారా లేక అనవసరంగా రోడ్లపైకి వస్తే వెయ్యి రూపాయల జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష విధించడం ఖాయమంటూ మైకు లో ప్రజలకు వివరించారు. ఈ పోరాటం పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు, మహిళలు కరోన వైరస్ బారిన పడకుండ మనుగడ కాపాడుకోవడం కోసం జరుగుతుందన్నారు. దయచేసి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలుఖచ్చితంగా పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు పాటించాలని పట్టణ సిఐ. శ్రీధర్ తెలిపారు.