ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చెన్నూరు లో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, సజ్జ మురళీకృష్ణ సహకారంతో  ఈరోజు 22. 4. 20వ తేదీన చెన్నూరు సచివాలయం లో గ్రామ వాలంటీర్స్ కు, సచివాలయం సిబ్బందికి , పరిశుద్ధ కార్మికులకు, ఆశ వర్కర్స్ కి  కూరగాయల పంపిణీ నిర్వహించడమైనది. మున్సిపల్ కమిషనర్ ఓబులేసు  చేతుల మీదగా అందించడం అయినది .అధ్యక్షుడు కడివేటి  చంద్రశేఖర్,ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం, కార్యవర్గ సభ్యులు M.Masthanaiah, ప్రజెంధ్ర రెడ్డి, కందలి మురళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.