ఏపీలో కొత్తగా మరో 80 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా మరో 80 కరోనా కేసులు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 80 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 893కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 14, తూర్పు గోదావరి జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 18, కృష్ణా జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 31, విశాఖపట్నం జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 21 మంది కరోనా నుంచి  కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య  141కి చేరింది. కొత్తగా కరోనాతో ఇద్దరు మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 27గా నమోదైంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 725 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.