నాటుసారా నిరోధించడంలో పోలీస్ పాత్ర పెరగాలి. : వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి

నాటుసారా నిరోధించడంలో పోలీస్ పాత్ర పెరగాలి.


మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి.


  గుంటూరు, ఏప్రిల్ 28(అంతిమ తీర్పు) :  ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులు లేకపోవడం వలన నాటుసారా ఉత్పత్తి,  వినియోగం గణనీయంగా పెరుగుతుందని, ఈ నేపథ్యంలో నాటుసారా నిర్మూలనకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిబ్బందితోపాటు పోలీస్ పాత్ర గణనీయంగా పెరగాలని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ఈనెల 28 న రాష్ట్ర హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత ను కలిసి వివరించారు.లాక్ డౌన్  కారణంగా 3500 ప్రభుత్వ మద్యం షాపులు,  800కు పైగా బార్ లు  మూతపడటం వలన మద్యం వ్యసనపరులు నాటుసారా,  గంజాయి,  కల్తీకల్లు లాంటి మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారని వీటన్నిటికీ సమూలంగా నిర్మూలించడానికి పరిమితంగా ఉన్న ఎక్సైజు సిబ్బందికి పోలీస్ యంత్రాంగం తోడ్పాటు నoదించాలని రాష్ట్ర  హోం శాఖ మాత్యులు సుచరిత ను కోరారు.
      ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మాత్యులు మేకతోటి సుచరిత స్పందిస్తూ రాష్ట్ర డిజిపిని కలిసి మాట్లాడుతానని నాటుసారా,  గంజాయి,కల్తీకల్లు లాంటి మత్తు పానీయాల నిర్మూలనకు పటిష్టమైన కృషి చేయవలసిందిగా అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. ఎక్సైజ్ సిబ్బంది ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారని నల్లబెల్లం వినియోగాన్ని అరికడుతున్నారని వి. లక్ష్మణ రెడ్డి వివరించారు. ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వినీత్ బ్రిజిల్ పటిష్టమైన చర్యలు చేపడుతున్నారని అభినందించారు.


   


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image