కరోనా వైరస్ నశించాలని శివలింగ పూజలు చేసిన వీరశైవ లింగాయత్ లు

కరోనా వైరస్ నశించాలని శివలింగ పూజలు చేసిన వీరశైవ లింగాయత్ లు


ఎమ్మిగనూర్,ఏప్రిల్,14 (అంతిమతీర్పు):- ఎమ్మిగనూరు మండలం పరిధిలోని కే. తిమ్మాపురం గ్రామం లో మంగళవారం ఉదయం 11గంటలకు ఎమ్మిగనూరు తాలూకా వీరశైవ లింగాయతల సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బి. సి. నాగరాజు  మాట్లాడుతూ యావత్ ప్రపంచాన్ని, ప్రజల్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారినీ సమూలంగా నాశనం కావాలని, ఈ వైరస్ బారిన పడి అనారోగ్యం పాలై మరణాలు సంభవిస్తున్నాయి అని తెలిపారు.కరోనా వైరస్ రోగులు త్వరగా కోలుకోవాలని జగద్గురువుల ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం 7గంటలకు కే.తిమ్మాపురం గ్రామంలో ఉన్న ఉమా మహేశ్వర దేవాలయం నందు భోళాశంకరుడినీ కోరుతూ వీరశైవ లింగాయతులందరూ సామూహిక ఇష్టలింగ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఇప్పటికైనా మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న covid 19 వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసి కలిసిపోకుండా ఆ భగవంతుడైన శివపరమాత్మ డే కాపాడాలని వీరశైవ లింగాయత్ లు కోరుతున్నారు.ఇప్పటికైనా మన భారతదేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య పాజిటివ్ కేసులు గా లేనట్లు చూడాలని ఆ శివపరమేశ్వరుని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ వీరశైవలింగాయత్ లందరూ, అలాగే గ్రామ పెద్దలు,భారీ సంఖ్యలో హాజరు కావడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా భారతదేశానికి శాంతి చేకూరాలని వీరశైవ లింగాయత్ లు అందరూ కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వీరశైవ లింగాయత్ అధ్యక్షులు బసన్న, కార్యదర్శి పెద్ద రామలింగప్ప, సలహాదారు హోటల్ రామలింగప్ప, డాక్టరు మల్లేషప్ప, శివ, బద్రి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..