నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపు

అమరావతి
24.4.2020



నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపు



*- 67,874 రైతు ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ సొమ్ము*



*- రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు సాయం*



*- 67,874 మంది రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ. 54.52 కోట్ల పంట నష్టపరిహారం చెల్లింపు.*


 


*- ఆదేశాలు జారీ చేసిన  వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌* 


 


*- పంట నష్టపోయిన రైతుల జాబితాలో పేర్లున్న వారి ఖాతాలకు నగదు జమ* 



*- ఆధార్‌ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాలకు ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిన నగదు డిపాజిట్*



*- గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో లబ్దిపొందిన రైతుల జాబితాల ప్రదర్శన*