వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం

*వెల్లివిరిసిన వనిపెంట సుబ్బారెడ్డి దాతృత్వం  వింజమూరు, ఏప్రిల్ 9 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి) : వింజమూరులోని నడిమూరు ప్రాంతానికి చెందిన వి.యస్.ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత వనిపెంట.సుబ్బారెడ్డి స్థానిక ప్రజలకు 10 రకాల నిత్యావసర సరుకులను గురువారం నాడు పంపిణీ చేశారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి ముఖ్య అతిధులుగా విచ్చేసిన తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించి ఉన్నందున పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు జీవన స్థితిగతులు భారంగా మారాయన్నారు. వీటిని గమనించిన దాతలు తమ వంతు సహాయం అందించడం గొప్ప విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ అనేది అత్యంత ప్రమాదకరమైందని, కేవలం ముందు జాగ్రత్త చర్యలతోనే నివారణ దిశగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వింజమూరు మండలంలో పేద వర్గాలను ఆదుకునేందుకు దాతలు విరివిగా ముందుకు రావడం ప్రశంసనీయమంటూ దాతలకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్న దాతల సేవాగుణం మరువరానిదన్నారు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల పంపిణీ సమయాలలోప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా సమదూరం పాటించే విధంగా దాతలు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. అనంతరం సుబ్బారెడ్డి అధ్వర్యంలో ఇంటింటికీ పలువురు యువకులు తిరుగుతూ ఫల సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమాలలో పంచాయితీ కార్యదర్శి బి.శ్రీనివాసులురెడ్డి, బి.జె.పి జిల్లా ఉపాధ్యక్షులు యల్లాల.రఘురామిరెడ్డి, పి.సి.సి సభ్యులు మద్దూరు.రాజగోపాల్ రెడ్డి, టి.డి.పి బి.సి విభాగం నేత నీలం.పెరుమాళ్ళు తదితరులు పాల్గొన్నారు.