భారతీయులుగా ఈ పోరాటం చేద్దాం :ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

*04–04–2020*
*అమరావతి*


*ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రజలనుద్దేశించి వీడియో ద్వారా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సందేశం


రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.
మనుషులుగా వేరుగా ఉంటూ, మనసులు ఒక్కటిగా ఈ కరోనా మీద పోరాడాల్సిన సమయమిది.
భారతీయులుగా ఈ పోరాటం చేద్దాం.
ఇక్కడే ఒక విషయం చెప్పాలి, ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్‌కు, ఒక కాంగ్రిగేషన్‌కు అనేక ప్రాంతాల నుంచి, కొన్ని దేశాల నుంచి ఆధ్యాత్మిక ప్రతినిధులు  హాజరయ్యారు.
 ఆ ఆధ్యాత్మిక సమావేశానికి వచ్చిన ప్రతినిధుల్లో ప్రత్యేకించి విదేశీ ప్రతినిధుల్లో కొందరికి కరోనా ఉండటం, ఆ మీటింగ్‌కు వెళ్లిన మన దేశస్తులు, మన రాష్ట్రం వారికి కూడా కరోనా సోకడం దురదృష్ణకరమైన పరిణామం. 
ఇదే సంఘటన ఏ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలోనైనా జరగవచ్చు.
మన దేశంలో అనేకమంది ఆధ్యాత్మిక వేత్తలున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వేలు, లక్షల భక్తులున్న అనేకమంది ,అన్ని మతాల్లోనూ పెద్దలున్నారు.
 ఒక రవిశంకర్‌ గారి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గాని, జగ్గీవాసుదేవ్‌ గారి ఈషా పౌండేషన్‌లో గాని, మాతా అమృతానందమయి సభల్లో గానీ, లేదా ఒక పాల్‌ దినకరన్‌ గారి ఆధ్యాత్మిక కార్యక్రమంలో గానీ, లేదా జాన్‌ వెస్లీ గారు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో గానీ ఎవరైనా పాల్గొనవచ్చు. 
ఎవరికైనా ఈ పరిస్దితి రావచ్చు. 
కాబట్టి ఇది ఎక్కడైన జరగవచ్చు. ఎక్కడ జరిగినా అదొక ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనగా కాకుండా దురదృష్టకర సంఘటనగానే చూడాలే తప్ప, ఓ మతానికో, ఒక కులానికో దాన్ని ఆపాదించి వారేదో తప్పుచేసినట్టుగా, నేరం చేసినట్లుగా, కావాలని చేసినట్లుగా చూపడం, చూపే ప్రయత్నం  ఎవ్వరూ కూడా చేయకూడదు.
అలాంటి ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం, ఇలాంటి ప్రయత్నాలు మనమంతా ఒక్కటిగానే ఉన్నామని చెప్పేదానికి మంచి చేయవు.  
కరోనా బాధితులు మీద మనం ఈ సమయంలో చూపాల్సినది ఆప్యాయత. 
మనవాళ్లను మనం వేరుగా చూడకూడదు. దురదృష్టవశాత్తూ జరిగిన ఈ సంఘటనకు ఫలానా మతం వారి మీద, మన వారి మీద ఒక ముద్రవేయటానికి ఎవరూ వాడుకోవద్దు.
 ఇది ఎవరికైనా జరిగే అవకాశమున్న సంఘటనగానే భావించాలి.
 ఈ సమయంలో భారతీయలుమంతా ఒక్కటిగానే కనపడాలి, ఒక్కటిగానే ఉండాలి.
 కరోనా కాటుకు మందు లేదు. కరోనా కాటుకు మతాల్లేవు.  కరోనా కాటుకు ధనిక, పేద అనే తేడా లేదు.
 కరోనా కాటుకు దేశాల కూడా డిఫరెన్సియేషన్‌ కూడా లేదు.
 యుద్ధంలో మన ప్రత్యర్ధి మన కంటికి కనిపించని కరోనా అనే ఒక వైరస్‌. 
దీనికి వ్యతిరేకంగా మనుషులుగా అందరం పోరాటం చేస్తున్నాం.
అందరం ఐక్యంగా ప్రపంచానికి, దేశానికి చాటిచెబుతాం.
దేశ ప్రధాని కూడా ప్రధాని హోదాలో ఈ  మేరకే పిలుపునిచ్చారు. 
5వ తేదీన తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు మనమంతా వెలిగించే దీపాలు కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు అనే సరిహద్దులు లేకుండా అందరం ఒకటే అనే సందేశాన్నిస్తూ వెలగాలి.
 చీకటిని నింపుతున్న కరోనా మీద దివ్వెలు, దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లు, సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులు నిజమైన వెలుగుకు నిజమైన అర్ధం తేవాలి. 
ఈ మెసేజ్‌ ఏ  పరిస్ధితులో ఇస్తున్నాం అన్నది ఇవాళ ఏ మీడియా ఛానెల్, టీవీ ఛానల్‌  చూసినా సోషల్‌ మీడియాలో పరిస్ధితులు చూసినా అందరికీ కూడా అర్ధమవుతుంది. 
ఇక్కడ కావాల్సింది  ప్రతీ ఒక్కరు ఒకరికొకరు తోడుగా ఉండటం. 
మనలో మనం ఢిపరెన్షస్‌ తీసుకొని వచ్చి, మనమంతా మనలో మనం ఒక కరోనా లాంటి వైరస్‌ వచ్చి మనని డిఫరెన్షయేట్‌ చేసే పరిస్ధితుల్లోనికి తీసుకుపోకుండా ఉండటం.
 కాబట్టి అందరూ కూడా సహృదయంతో నేను చెప్పే ఈ విజ్ఞప్తిని తీసుకుంటారని, మనమివ్వబోయే  మెసేజ్‌ 5వ తారీఖున గొప్పగా దేశానికే ఆదర్శవంతంగా ఇవ్వగలుగుతామని చెప్పి చెపుతాఉన్నాం. ఇక ఈ విషయమే కాకుండా ఈ కరోనా వైరస్‌ మీద ఫ్రంట్‌లైన్‌లో ఉంటూ  యుద్దం చేస్తా ఉన్న మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంటు, పోలీసు డిపార్ట్‌మెంటు, శానిటేషన్‌ వర్కర్స్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పంచాయితీరాజ్ డిపార్ట్‌మెంటులో ఉన్న శానిటేషన్ వర్కర్స్‌, ఫ్రంట్‌ లైన్‌లో ఉండి పోరాటం చేస్తా ఉన్న వీళ్లకు మోటివేషన్‌గా ఉండటం కోసం ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాం.
 మిగతా స్టాప్‌లో ఉన్నవారందరికీ కూడా జీతాలు కాస్తా వాయిదా వేసే కార్యక్రమం అందరితో మాట్లాడిన తర్వాత వాళ్లని కూడా ఒప్పించి వాయిదా వేసుకునేదానికోసం వాళ్లను ఒప్పంచిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది.
 కానీ ఈ కరోనా టైంలో వీళ్లకి మాత్రం అంటే మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంటు, శానిటేషన్, పోలీసుశాఖ మాత్రం మోరల్‌గా ఫ్రంట్‌ లైన్‌లో ఉన్నారు.
వాళ్లని మనం ఏదన్నా మోటివేట్‌ చేసే దానిలో భాగంగా వీళ్లకు మాత్రం పూర్తి జీతాలు కష్టమనిపించినా కూడా... ఈ నెలది, ఈ నెలకు సంబంధించినంత వరకు ఎలాంటి పోస్ట్‌ పోన్‌ మెంటు లేకుండా జీతాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image