రెడ్ జోన్ల మీద ప్రత్యేక దృష్టి సారించండి : గూడూరు సబ్ కలెక్టర్

రెడ్ జోన్ల మీద ప్రత్యేక దృష్టి సారించండి అధికారులతో గూడూరు సబ్ కలెక్టర్


గూడూరు :సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ IAS అధ్యక్షతన డివిజనల్ స్థాయి అధికారులతో సమీక్ష.లాక్ డౌన్ సడలింపులు,జోన్ల వారిగా అమలుచేయాల్సిన నిబంధనలు  తీసుకోవలిసిన చర్యలు మీద అధికారులకు సూచనలు.


*పరిశ్రమలకు అనుమతి జిల్లా కలెక్టరేట్ లో తీసుకోవాలిసిందే,లిక్కర్ పూర్తిగా నిషిద్ధం.ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలి.ఉదయం 10 తరువాత రెవెన్యూ పోలీస్ శాఖ లు లాక్ డౌన్ అమలు పటిష్టం గా అమలుచేయాలి.గూడూరు డివిజన్ లో మూడు మాత్రమే గ్రీన్ జోన్లు.


ఈ రోజు గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ లో డివిజన్ స్థాయి అధికారులకు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ కొన్ని సూచనలు చేశారు,ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ లోని కొన్ని వెసులుబాటులు మీద అవగాహన కల్పించారు,గ్రీన్ జోన్ లో మాత్రమే కొన్ని వెసులుబాటులు వుంటాయని,మిగిలిన జోన్లలో లాక్ డౌన్ యడావిడిగానూ ఇంకా కఠిన తరంగానూ అమలు చేయాలన్నారు,రెడ్ జోన్ లోని వారికి గ్రీన్ జోన్ల నుండి డాక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకుని సహాయ సహకారాలు అందించాలని,రెడ్ జోన్లోని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట రాకూడదని అలా వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు,ఏ విషయమైనా స్పాట్ లో నిర్ణయాలు తీసుకునే అధికారం మండల తహసీల్దార్ కు ఉంటుందని వివరించారు,


అలాగే గూడూరు డివిజన్ లో మూడు మండలాలు గ్రీన్ జోన్లు ఉన్నాయని 
1.డక్కిలి
2.సైదాపురాం
3.కోట మండలాలు గా గుర్తింపు...


ఈ గ్రీన్ జోన్లలో 4వీలర్ లో ఐతే డ్రైవర్ తోపాటు వెనక ఇద్దరు ప్రయాణించే అవకాశం ఇచ్చారని చెప్పారు,


ఈ సమీక్షలో గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు,గూడూరు DSP భవాని హర్ష,DDMHO అచ్యుత కుమారి,ఫిషరీస్ AD చాంద్ బాషా ఇంకా వివిధ శాఖల  అధికారులు పాల్గొన్నారు...


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..