ధరల నియంత్రణ దిశగా తహసీల్ధారు తనిఖీలు

ధరల నియంత్రణ దిశగా తహసీల్ధారు తనిఖీలు వింజమూరు, ఏప్రిల్ 23 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని కిరాణా దుకాణాల వద్ద గురువారం ఉదయం తహసిల్ధారు సుధాకర్ రావు విస్తృతంగా పరిశీలనలు చేశారు. వస్తువుల ధరలు గురించి ఆరా తీశారు. ఎట్టి పరిస్థితులలోనూ వస్తువులకు కృత్రిమ కొరతను సృష్టించడం గానీ, అధిక ధరలకు విక్రయించడం గానీ చేయరాదని దుకాణాదారులకు సూచించారు. లాక్ డౌన్ ప్రకటించిన గత నెల మొదటి రోజు నుండి కూడా తహసీల్ధారు సుధాకర్ రావు ప్రధానంగా నిత్యావసర వస్తువుల వస్తువుల ధరలపై దృష్టి సారించారు. అందులో భాగంగా కూరగాయలు, కిరాణా కొట్లు దుకాణాదారులతో అప్పట్లోనే సమావేశాలు నిర్వహించి దుకాణాల ముందు భాగంలో ధరల పట్టికల బోర్డులను ఏర్పాటు చేయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వస్తువులను వినియోగదారులకు విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసి ఉన్నారు. ఈ నేపధ్యంలో ప్రతిరోజూ ఉదయం తహసిల్ధారు నిత్యావసర సరుకుల దుకాణాలను పరిశీలిస్తూ కొనుగోలు దారులను ధరల విషయమై అడుగుతూ వారి స్పందనను బట్టి ముందుకు సాగుతున్నారు. ఏ మాత్రం కృత్రిమ కొరత సృష్టించినా, ధరలు పెంచినా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తూ ధరల నియంత్రణకు గట్టి చర్యలు చేపడుతున్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..